1. బాలకాండ --రామాయణము


శ్రీరామచంద్రపరబ్రహ్మణేనమః
1.     బాలకాండ
ఓం తపః స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరం
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుఙ్గవం                       ———    1
తపస్సు స్వాధ్యాయనములయందు సదా నిరతుడై యుండు వాడును, విద్వాంసులలో శ్రేష్టుడును, మునివర్యుడును అగు నారదుని తపస్వియగు వాల్మీకి ఇట్లడిగెను — 
యోగ నిర్వచనం బాలకాండ అనగ యోగమునకు ఉపక్రమించుట. అనగా యోగా ప్రారంభదశ. నా రథుడు  అనగా శరీరములేని సద్బుద్ధి.  తపస్సు, స్వ అధ్యాయము అనగా తన శ్వాసను తను  అధ్యయనము చేయుట. అనగా వాల్మీకి తీవ్ర ధ్యానములో ఆత్మావబోదను వినెను. అది ఇతి ఈ విధముగా,  హాసము చెప్పబడినది, అదియే రామాయణ ఇతిహాసముగా  మానవాళికి అందించెను. 
కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః                               2
ప్రస్తుతము లోకములో గుణవంతుడును, శక్తివంతుడును, ధర్మజ్ఞుడును, కృతజ్ఞుడును, సత్యము పలుకువాడును, దృఢవ్రతుడును అగు వాడెవాడు కలడు?
యోగ నిర్వచనం గుణవంతుడు అనగా సత్వ రజో తమో గుణములను తన ఆధీనములో ఉంచుకొనినవాడు,  అట్టివాడేశక్తిగలవాడు, వాడే ఇంద్రియధర్మములను వీడి ఆత్మధర్మమును పాటించువాడు, వాడేకృతజ్ఞుడు, వాడే సత్యము పలుకువాడు, అట్టివాడే  దృఢవ్రతుడు అనగా నిశ్చలమయిన వ్రతముగలవాడు మాయకు లోబడనివాడు. 
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః
విద్వాన్ కః సమర్థశ్చ  కశ్చైక ప్రియదర్శినః                         3
సదాచార సంయుక్తుడును, సమస్త ప్రాణికోట్ల యొక్క హితమును సాధించువాడును, విద్వాంసుడును, సామర్థ్యశాలియు, సౌందర్యవంతుడును అగు వాడెవడు కలడు?
యోగ నిర్వచనం సదాచార సంయుక్తుడు అనగా ఆత్మవబోదను ఆచరించేవాడు ను, సమస్త ప్రాణికోట్ల యొక్క హితమును సాధించువాడు అనగా ఆత్మ లేక పరమాత్మ, విద్వాంసుడును అనగా ఆత్మజ్ఞానము కలవాడు, సామర్థ్యశాలియు అనగా ఆత్మజ్ఞానము కలవాడే నిజమయిన సామర్థ్యశాలి, సౌందర్యవంతుడు అనగా ఆత్మసౌందర్యము గలవాడే అసలయిన  సౌందర్యవంతుడు.
ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే                4
ఆత్మవంతుడును, క్రోధమును జయించినవాడును, ప్రకాశవంతుడును,  అసూయలేని వాడును అగు వాడు ఎవడు ఉన్నాడు? యుద్ధమందు కుపితుడైనచో దేవతలు ఎవరినిజూచి భయపడుడురు?
యోగ నిర్వచనం క్రోధమును జయించినవాడును, ప్రకాశవంతుడును,  అసూయలేని వాడును అగు వాడు కేవలము ఆత్మవంతుడే. సకారాత్మక నకారాత్మక శక్తుల యుద్ధములో దేవతలయిన సకారాత్మక శక్తులు సైతము ఆత్మతో తలపడలేవు. ఈ రెండింటికీ అతీతము అది.
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ద్రుతిమాన్         5
నారదుడు చెప్పెను: ———
ఇక్ష్వాకువంశమున జన్మించి లోకములో రాముడు అను పేరుతో విఖ్యాతులై యున్నట్టి మహానీయులొకరు కలరు. వారు మనస్సును వశమొనర్చుకొనినవారును, మహాబల వంతులును, ప్రకాశవంతులును, ధైర్యవంశవంతులును, జితేంద్రియులును అయి ఉన్నారు.
యోగ నిర్వచనం
ఇమం వివస్వతే యోగం ప్రోక్త వానహమవ్యయం
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేబ్రవీత్                 గీత  4-- 1
శ్రీ భగవానుడు ఇట్లు పలికెను:-
నేను నిత్యసత్యమయిన యోగమును సూర్యునికి తెలిపితిని. సూర్యుడు వైవస్వత మనువునకు చెప్పెను. మనువు ఇక్ష్వాకునకు బోధించెను.
పరమాత్మ మొదటి వ్యక్తీకరణ పరమాత్మ ప్రకాశము.
పరమాత్మ తన చేతనని సర్వజ్ఞత్వముగల సర్వశక్తివంతమైన శక్తిగా లేక ప్రకాశముగా వ్యక్తీకరించాడుదీనినే  సూర్యుడు అంటారు.
ఈసర్వశక్తివంతమైన శక్తి లేక ప్రకాశమే మనిషియొక్క కూటస్థము లోని మూడవకన్ను లోని  వ్యష్టాత్మ లేక ఆత్మ సూర్యుడు.
సాధకుడు తన తీవ్ర సాధనతో తన మానవచేతనని మరియు తన రెండుకళ్ళలోని ద్వంద్వ విద్యుత్తులను కూటస్థములో కేంద్రీకరించినపుడు ఈమూడవకన్నును చూడగలడు. సర్వ శక్తివంతమైన పరమాత్మ ప్రకాశమును అయిదు భుజములుగల వెండినక్షత్రముగా ఈ మూడవ కన్నులో చూడగలడు.
ఈమూడవకన్నుద్వారానే పరమాత్మచైతన్యము చక్రములద్వారా, నరముల కేంద్రముల లోకి, అక్కడినుండి శరీరములోనికి ప్రవేశిస్తుంది. మానవచేతనగా రూపొందుతుంది.
ఈ మానవచేతన చిత్త(భావనల సరస్సు), అహంకారము(నేను,నాది అనేభావన), నిశ్చయాత్మకమైన బుద్ధి(తెలివి) మరియు మనస్సు (ఇంద్రియవిషయలోలత) లకు కారణ భూతమగును.
స్థూలమనస్సులోని  పరిమితమైన మానవచేతన అపరిమితమైన పరమాత్మచేతనని గ్రహించలేదు. క్రియాయోగసాధనతోనే గ్రహించ వీలగును. మనస్సు ఆత్మసూర్యునినుండే వ్యక్తీకరించబడినది. అందువలన ఆత్మసూర్యుని కుమారుడు కారణచేతన అనగా కారణమనస్సు అనగా వైవస్వతుని కుమారుడు వైవస్వత  మనువు.
ప్రాణశక్తికి మూలము సూర్యుడు(వైవస్వతుడు) అనగా పరమాత్మ ప్రకాశము. మనస్సు ద్వారానే ప్రాణశక్తి సూక్ష్మశరీరములో వ్యక్తీకరిస్తుంది. మనిషి శరీరములో ప్రాణశక్తి మరియు మనస్సు ఒకటిలేకపోతే ఇంకొకటి ఉండలేదు. అందుకనే చంచలమనస్సుని స్థిరం చేస్తే చంచల ప్రాణముకూడా స్థిరం అవుతుంది.
పరమాత్మచేతన మరియు పరమాత్మశక్తి, మానవచేతన అనగా మానవ మనస్సు మరియు ప్రాణశక్తిగా వ్యక్తీరించుటకు మార్గము కూటస్థములోని మూడవకన్ను.
కారణశరీరము మరియు సూక్ష్మశరీరముల రెండింటి వ్యక్తీకరణకు మార్గము ఈ మూడవకన్నే
సూక్ష్మశరీరమూడవకన్నుకి కారణమైనది కారణశరీర మూడవకన్ను.
కారణశరీరము మరియు సూక్ష్మశరీరముల రెండింటి వ్యక్తీకరణకు మార్గము ఈ మూడవకన్నే
సూక్ష్మశరీర మూడవకన్నుకి కారణమైనది కారణశరీర మూడవకన్ను.
కారణశరీరమునకు కారణశరీర మేరుదండము, అలాగే సూక్ష్మశరీర మునకు సూక్ష్మశరీర మేరుదండము ఉంటాయి.
సుషుమ్ననాడి సూక్ష్మశరీర మేరుదండమునకు, దానిలోని వజ్ర, వజ్రలోని చిత్రి,  మరియు చిత్రిలోని   బ్రహ్మనాడి కారణశరీరమేరు దండమునకు సంబంధించినవి.              
పరమాత్మచేతన మరియు పరమాత్మశక్తి, రెండూను మొదట కారణశరీర మూడవ కన్ను ద్వారా కారణశరీర మేరుదండములోనికి కారణచేతన మరియు కారణ ప్రాణశక్తిగా ప్రవేశిస్తాయి.
కారణశరీర మేరుదండముద్వారా సూక్ష్మశరీర మూడవకన్నులోనికి, దాని ద్వారా సూక్ష్మశరీర మేరుదండములోనికి సూక్ష్మచేతన మరియు  సూక్ష్మప్రాణశక్తిగా ప్రవేశిస్తాయి.
సూక్ష్మశరీర మూడవకన్నునే ఇక్ష్వాకు అంటారు. ఇక్ష్ అనగా నేత్రము అని అర్థము.
మనువు అనగా కారణ చేతనా మనస్సుయొక్క కొడుకు ఇక్ష్వాకు.
ఇక్ష్వాకుస్థితిలో ఉండే అహంకారము స్థూల ఇంద్రియములనుండి రాదు. ఆత్మనుండి వస్తందిదీనినే సహజావబోధన అంటారు.
సూక్ష్మశరీర మేరుదండముద్వారా స్థూలశరీర మేరుదండము లోనికి మానవచేతన మరియు  ప్రాణశక్తిగా ప్రవేశిస్తాయిఅక్కడినుండి విషయాసక్తిగల స్థూలజ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలలోనికి ప్రవేశిస్తాయి. విషయాసక్తిగల స్థూలజ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాల స్థితిని రాజర్షిస్థితి అంటారు. విషయాసక్తిగల స్థితిలో మనిషి యోగము మర్చిపోతాడు, చెయ్యడు.
ర కారము అగ్నిబీజము, పాపవినాషిని.
ఆ కారము సూర్యబీజము, అజ్ఞానము అను చీకటిని పోగొట్టును.
మా కారము  చంద్ర బీజము, ఆనందము శాంతి కలుగజేయును.
ఓంకారమునకు రామనామమునకు బేధము లేదు. రెండింటికీ తారకము అని పేరు. 
ఇక్ష్వాకువంశమున అనగా సహజావబోధనతో  జన్మించిన వారినే ఈ లోకములో రాముడు అను పేరుతో విఖ్యాతులై యుంటారు. వారు మనస్సును వశమొనర్చుకొనినవారును, మహాబల వంతులును, ప్రకాశవంతులును, ధైర్యవంశవంతులును, జితేంద్రియులును అయి ఉన్నారు, ఉంటారు.
బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః
విపులాంసోమహాబాహుః కంబుగ్రీవొ మహాహనుః          ---6
యోగ నిర్వచనం
కనుక అట్టి రాములవారే బుద్ధిమంతులును, నీతిమంతులును, వక్తయు, శోభాయమాను లును, శత్రుసంహారకారకులును అయి ఉన్నారు. వారి మూపు లావైనది. వారి భుజములు చాల పెద్దవి. కంఠము శంఖమును బోలియుండును. చెక్కిళ్ళు పుష్టికరము లునూ అయినవి.
ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితెహ్ రతః
యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వష్యః సమాదిమాన్                                    --7
సహజావబోధనతో జన్మించిన రాముల వారు ధర్మమును ఎరిగినవారును, సత్యసంధులును, ప్రజలకు హితమొనగూర్చుటయందు నిరతలును, యశస్వియు, జ్ఞాన సంపన్నులును, పవిత్రులును, జితేంద్రియులును, మనస్సును, ఏకాగ్రత పఱచువారును అయియున్నారు.
ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపు నిషూదనః
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా                                         ---8
వారు ప్రజాపతివంటి పాలకులును, శ్రీమంతులును, శతృ వినాశకులును, జీవులను సంరంక్షించువారును, ధర్మమును లెస్సగా కాపాడువారును, అయియున్నారు.
ప్రాచేతసుడి భార్య మరిష.  ప్రాచేతసుడు అనగా శుద్ధ చేతన. మరిష అనగా కోరిక. భౌతిక జగత్తుకి మూలకారణము కోరికలతో కూడిన శుద్ధ చేతన. అప్పుడు వ్యక్తీకరించినవాడినే దక్షుడు అంటారు. క్రమముగా ఆ దక్షుడే ప్రజాపతిగా వ్యవహరించబడ్డాడు.  తత్తదుపరి అనేకమంది ప్రజాపతులు వ్యక్తీకరించబడ్డారు. కనుక మొదటి పురుషుడే దక్ష ప్రజాపతి. మనస్సే బ్రహ్మ.
పరమాత్మ లోనిదే మాయ. మాయకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. విష్ణు, లలితా, కృష్ణ, రామ, బ్రహ్మ, శివ ఇత్యాది దేవీ దేవతలుగా పిలవబడేది మాయ. మా అనగా కాదు, య అనగా యదార్థము. పదార్ధము యదార్థము కానేరదు. మాయ అనగా పరమాత్మ శక్తి తనను తాను సృష్టి స్థితి లయలుగా విభజించుకొని పని నడుపుతూ ఉంటుంది.  సృష్టి అనగా బ్రహ్మ, స్థితి అనగా విష్ణు, లయ అనగా శివ. ఒకే మనిషి భర్తగా, తండ్రిగా, కొడుకుగా, తాతగా, అధికారిగా వివిధములయిన రూపధారణ గావిస్తూ పనులు చేస్తూ ఉంటాడు. ఆ విధముగానే ఒకే పరమాత్మ శక్తి సృష్టి స్థితి లయలుగా విభజించుకొని ఈ జగత్తును  నడుపుతూ త్రిమూర్తులుగా వ్యవహరించబడుతూ ఉంటుంది. అనగా ఈ త్రిమూర్తులు ఒకే శక్తి యొక్క మూడు రూపములు.
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా
వడ వేదాఙ్గ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః              ---- 9
వారు స్వధర్మమును అనగా  ఆత్మధర్మమును పాలించువారును, స్వజనులను అనగా  ఆత్మధర్మమును పాలించుజనులను రక్షించువారును, వేద అనగా (వినబడునది) ఓంకారము,  వేదాఙ్గము( కార-సృష్టి , ‘కార-స్థితి, మరియు కారము-లయ)ల తత్వము నెరిగినవారును, ధనుర్వేద మందు(మేరుదండమును నిఠారుగా ఉంచి ధ్యానముచేయుటలో) ప్రవీణులును అయి ఉన్నారు.
సర్వశాస్తార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ 
సర్వలోకప్రియః సాధురదీనాత్మా విచక్షణః              ----  10
శ్వాసను అస్త్రముగా ఉపయోగించటమే శ్వాస్త్రము. అది క్రమముగా శాస్త్రము అయినది.
రాములవారు సర్వ శాస్త్రములయొక్క తత్వమునెరిగిన వారు. శ్వాసను అస్త్రముగా ఉపయోగించటము తెలిసిన జ్ఞానివారు కనుక రాముల వారు జ్ఞాపకశక్తిగల వారును, ప్రతిభాసంపన్నులును, సమస్తజనుల ప్రియమయిన వారును, పవిత్రులును, ఉదార హృదయులును, సంభాషణ చతురులును అయి యున్నారు.
చతుర్వింశతి సహస్రప్రాణి శ్లోకానాం ఉక్తవాన్ ఋషిః
తాతా సర్గ శతాన్ పఞ్చ షటుకాండాని తథోత్తరం          ---- 11
ఆత్మావబోధపొందిన వాల్మీకిమహర్షి 24 వేల శ్లోకములను, 500 సర్గాలను, ఉత్తరాకాండ  సహ 7 కాండలను రచియించెను. 
కామీ వా న కదర్యో వా నృశంసః పురుషః క్వచిత్
ద్రష్టుం శాక్యమయోధ్యాయాం నా విద్వాన్ న చ నాస్తికః      ----12
అయోధ్య(వైకుంఠము)యందు ఎచటను కాముకుడుగాని, దరిద్రుడుగాని, క్రూరుడుగాని, చదువులేనివాడుగాని, నాస్తికుడుగాని కనుపించడు.
సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలః సుసంయతః
ముదితాః శీలవృత్తాభ్యాం మహర్షయః ఇవామలః               ----13
అయోధ్య(వైకుంఠము)యందు సాధారణ స్త్రీ పురుషులుకూడా  ధర్మశీలురును, సంయమవంతులును, ప్రసన్నచిత్తులును, శీలసదాచారవంతులు, మహర్షుల  వలె నిర్మలును అయి ఉండిరి.
తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం శత సమత్యయుః
తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ                ----- 14
నక్షత్రేదితి దైవత్యే స్వోచ్ఛ సంస్థేషు  పఞ్చసు
గ్రహేషు కర్కటేలగ్నే వాక్సతావిందునా సహ                   ------15
ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం
కౌసల్యాజనయద్ రామం దివ్యలక్షణ సంయుతం        ----------16
దశరథుమహారాజు పుత్రులు కలుగుటకై పుత్రకామేష్టి అను యాగమును చేసెను.  ఆ యజ్ఞము సమాప్తమైన పిదప ఆరు ఋతువులు గడిచినవి. పన్నెండవ మాసమున చైత్రశుద్ధ నవమి తిథియందు పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నమునందు కౌసల్యాదేవి దివ్య లక్షణసంపంన్నుడును, సర్వలోక వందితుడును, జగన్నాథుడును అగు శ్రీరామచంద్రుని కనెను. సూర్య, మంగళ, శని, బృహస్పతి, శుక్రులను అయిదు గ్రహములు ఉన్నత స్థానమందు నెలకొని యుండెను.
కైకేయికి భరతుడు జన్మించెను. సుమిత్రదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించిరి. 
సర్వే జ్ఞానోప సంపన్నాః సర్వే సముదితా గుణైః
తేషామపి మహాతేజా రామః సత్యపరాక్రమః                      ----17
వారందరును జ్ఞానవంతులై సమస్త సద్గుణములతో కూడియుండిరి. వారిలోనూ సత్యపరాక్రమవంతుడగు శ్రీరాముడు అందరికంటే ఎక్కువ తేజస్వియై, జనులందరికిని మిక్కిలిప్రియుడై యుండెను.
తేచాపి మనుజవ్యాఘ్రా వైదికాధ్యయనే రతాః
పితృ శుశ్రూషణరతా ధనుర్వేదే చ నిష్టితః                                 ---18
పురుష సింహులగు ఆ రాజకుమారులు ప్రతిదినము వేదములయొక్క స్వాధ్యాయనము, పితృసేవ, ధనుర్వేదముయొక్క అభ్యాసములయందు నిమగ్నులైయుండిరి.
స్వాధ్యాయనము అనగా తన శ్వాస యొక్క గమనా గమనములను  గమనించుట.
ధనుర్వేదము అనగా మేరుదండము. తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ ఆ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి.
రెండుకనులమధ్య లలాటమును చూపుడువేలును త్రిప్పి ఉంచి త్రాకించి ఉంచవలయును. నెమ్మదినెమ్మదిగా ఈవేలు గోరున్న భాగముయొక్క చివరను రెండు కళ్ళతో చూస్తూ పైకుత్తుతూ ఉండ వలయును. చూపుడువేలుచివర కనబడక ఉండిన చోట దృష్టి నిలిపి ఉంచవలయును. దీనినే కూటస్థములో దృష్టి నిలుపుట అంటారు. దీనినే ధనుర్వేదముయొక్క అభ్యాసములయందు నిమగ్నులైయుండుట అంటారు.
ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాత్ ధర్మ ఇవాపరః
ధృతిమాన్ సువ్రతః శ్రీమాన్ ధర్మం హాతుమర్హసి    ----------------19
విశ్వామిత్రమహర్షి ఒక సుకార్యనిమిత్తమై దశరథుని వద్దకు వచ్చెను. ఆయన సహాయమును ఆర్జించెను.  దశరథుడు తప్పక సహాయము చేసేదనుఅనెను.
నేను ఒక యజ్ఞము చేయ తలపెట్టితిని. శ్రీరాముని తన వెంట యాగ రక్షణకై తీసికొని వెళ్ళెదను అనెను.  ఆ మాట వినిన వెంటనే శ్రీరాముని బదలుగా తను వచ్చెదను అనెను.
ఆడి తప్పకూడదు అని వశిష్టమహర్షి దశరథునికి నచ్చజెప్పెను.   వరిష్ట మయిన శిష్ట అనగా సదాచారముగలవాడు వశిష్టుడు.
మహారాజ, మీరు ఇక్ష్వాక(కారణ చేతనా మనస్సుయొక్క కొడుకు ఇక్ష్వాకు) వంశీయులు. రాజులు.  సాక్షాత్ ధర్మమూర్తులు. ధైర్వ్యవంతులు. సువ్రతులు. శ్రీమంతులు (పవిత్రమయిన మనస్సు గలవాడు). ధర్మమును పరిత్యజించ కూడదు.
*సూక్ష్మశరీర మూడవకన్నునే ఇక్ష్వాకు అంటారు. ఇక్ష్ అనగా నేత్రము అని అర్థము.
మనువు అనగా కారణ చేతనా మనస్సుయొక్క కొడుకు ఇక్ష్వాకు.
ఇక్ష్వాకుస్థితిలో ఉండే అహంకారము స్థూల ఇంద్రియములనుండి రాదు. ఆత్మనుండి వస్తందిదీనినే సహజావబోధన అంటారు.
సూక్ష్మశరీర మేరుదండముద్వారా స్థూలశరీర మేరుదండము లోనికి మానవచేతన మరియు  ప్రాణశక్తిగా ప్రవేశిస్తాయిఅక్కడినుండి విషయాసక్తిగల స్థూలజ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలలోనికి ప్రవేశిస్తాయి. విషయాసక్తిగల స్థూలజ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాల స్థితిని రాజర్షిస్థితి అంటారు. విషయాసక్తిగల స్థితిలో మనిషి యోగము మర్చిపోతాడు, చెయ్యడు.
వశిష్టుడు అనెను:
త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ
స్వధర్మం ప్రతిపద్యస్య నా ధర్మం వోఢుమర్హసి                   -----------20
రఘుకుల వంశుడయిన దశరథుడు గొప్ప ధర్మాత్ముడు.
దశరథుడు  = అయిదు శుద్ధ కర్మేంద్రియములు, అయిదు శుద్ధ జ్ఞానేంద్రియములు.
ఈ విషయము మూడు (భౌతిక, సూక్ష్మ, మరియు కారణ) లోకములయందు ప్రసిద్ధము.  మీ ధర్మమునే అనగా ఆత్మ ధర్మమునే పాలించుడు. అధర్మమును పాలించకడు.
ప్రతిశ్రుత్య కరిష్యేతి ఉక్తం వాక్యం అకుర్వతః
ఇష్టాపూర్తవధోభూయాత్ తస్మాత్ రామం విసర్జయః           --------------21
నేను ఈ యుక్త కార్యమును చేసెదనుఅని చెప్పినప్పుడు తప్పక చేయవలయును. లేనియడల సకారాత్మకశక్తులయోక్క శక్తి క్షీణించిపోవును. కావున మీరు శ్రీరాముని తప్పక మహర్షి విశ్వామిత్రుని వెంట పంపుడు.
కృతాస్త్రం అకృతాస్త్రం వా నైనం శక్ష్యంతి రాక్షసాః
గుప్తం కుశికపుత్రేణ జ్వలనేనామృతం యథా         ---------------------22
శ్రీరాములవారు శాస్త్రవిద్య ఎరిగినను ఎరగకపోయినను, రాక్షసులు అనగా అహంకారులు వారిని ఎదుర్కొన జాలరు. అగ్నిచే ప్రజ్వలించు అమృతమును ఎవరునూ తాకజాలరు. అట్లే విశ్వామిత్ర మహర్షిచే సురక్షితుడయిన శ్రీరాముని రాక్షసులు ఏమీ చేయజాలరు.
విశ్వానికే మిత్రుడు విశ్వామిత్రుడు.
అంతట దశరథుడు తన పుత్రుడు శ్రీరాముని విశ్వామిత్రమహర్షి వెంట పంపుటకు సమ్మతించెను.  శ్రీరాముని పిలిచి మహర్షి వెంట వెళ్ళమని చెప్పెను. అందుకు శ్రీరాముడు ఇట్లనెను:
గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్య చ హితాయచ
తవచైవా ప్రమేయస్య  వచనం కర్తుముద్యతః               ----------  23
గో= ఇంద్రియములు,     బ్రాహ్మణ = బ్రహ్మ జానాతి ఇతి బ్రాహ్మణః
పుట్టుకతో ఎవ్వడూ బ్రాహ్మణుడు కాలేడు.  బ్రహ్మ జ్ఞానము తెసినవాడే బ్రాహ్మణుడు.  బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి.
గో బ్రాహ్మణుల  హితము కొరకు, దేశక్షేమము కొరకు, మీవంటి అనుపమ ప్రభావశాలురైన మహాత్ముల ఆదేశములను పాలించుటకు నేను సర్వ విధముల సిద్ధముగా ఉన్నాను.
అప్పుడు శ్రీరాముడు ఆయనవెంట లక్ష్మణుడు తోడు వచ్చెను.
సహత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః
ఋషిభిః పూజితస్తత్ర యథేంద్రో విజయేపురా    ---------------  24
శ్రీరాముడు అనగా పవిత్రమయిన ఓంకారనాదము. లక్ష్మణుడు అనగా కుండలినీశక్తి. అనగా వ్యష్టిలోని మాయ. ఇక్కడ ఇంకొక విషయము చెప్పాలి. లక్ష్మణుని భార్య ఊర్మిళ. అనగా నిద్రాణమయిన కుండలినీశక్తి. శ్రీరాముని వెంట నడిచే లక్ష్మణుడు జాగృతిచెందిన కుండలినీశక్తి. శ్రీరాముని వెంట ఎల్లప్పుడూ లక్ష్మణుడు అనగా జాగృతిచెందిన కుండలినీ శక్తియే ఉంటుంది.
పవిత్రమయిన ఓంకారనాదము మహర్షి వెంట కదిలిరాగా ఆయనకు అపజయము కలగదు. ఈ విధముగా రఘునందనుడైన శ్రీరాముడు యజ్ఞమునకు విఘ్నము కలిగించు రాక్షసులందరినీ అనగా నకారాత్మక శక్తులను సంహరించెను. ఇంద్రియములకు రాజు ఇంద్రుడు అనగా మనస్సు.  నకారాత్మక శక్తులను జయించెను. పూజింపబడెను. శ్రీరాముడునూ అదేవిధముగా  ఋషులచే పూజింపబడెను.
ఇమౌ స్మ మునిశార్దూల కింకరౌ సముపాగాతౌ
ఆజ్ఞాపయ మునిశ్రేష్ఠ శాసనం కరవావ కిం        -------------------  25
కిం = ఏమి, కరౌ = చేయవలయును
మునిశ్రేష్ఠ, కింకరులమగు మేము ఇద్దరము మే సేవ కొరకు సంసిద్దులము. మునీంద్రా, ఏమి సేవ చేయవలయునో ఆజ్ఞాపించుడు.
అక్కడినుండి రామలక్ష్మణులిరువురును విశ్వామిత్రమహర్షి వెంట గౌతమ మహర్షియొక్క ఆశ్రమమునకు బయలుదేరి వెళ్ళిరి.
రాఘవౌ తు తదా తస్యాః పాదౌ  జగృహతుర్మదా
స్మరంతీ గౌతమవచః ప్రతిజ గ్రాహ సా హి తౌ   ------------------------- 26
రామలక్ష్మణులిరువురును చాలా సంతోషముతో అహల్యయొక్క పాదములను
స్పృశించిరి.  గౌతమ మహర్షియొక్క వాక్యములను సంస్మరించి అహల్య వారిని ఆదరించి గౌరవించెను.
అక్కడినుండి మిథిలా రాజు జనకమహారాజు వద్దకు వాళ్ళిద్దరినీ తీసికొని వెళ్ళెను. అక్కడ ధీమంతుడగు శతానందుడు శ్రీరామునితో ఇట్లనెను.
గౌతమఅహల్య
గౌతముని భార్య అహల్య. గౌతముడు భార్య అహల్యకు ఆథ్యాత్మిక బోధ చేస్తూ ఉంటాడు. ఆవిడ మనస్సు ఆ సమయములో చంచలముగా ఉంటుంది. ప్రాపంచిక విషయముల వైపుకి మళ్ళియుంటుంది. దానికి కారణములు ఇంద్రియములు. ఇంద్రియములకు రాజు ఇంద్రుడు అనగా మనస్సు.  అది గ్రహించిన గౌతముడు భార్య అహల్యను న హల్యఅహల్య (కదలకూడదు) అంటాడు. కదలకుండా రాయి లాగ నిశ్చలముగా ఉండమంటాడు. దీనినే అహల్య మనస్సు ఇంద్రుడు పయిన లగ్నమగుట మరియు గౌతముని శాపము పొందుట అందురు. రాముడు వచ్చి శాపవిమోచనము కలుగచేయుట అందురు. ఆథ్యాత్మిక విషయములు మనస్సు చంచలముగా ఉంటే బోధపడవు. బోధపడ వలయునన్న మనో నిశ్చలత అత్యంత ఆవశ్యకము. మనో నిశ్చలతయే ధ్యానము. అట్టి మనో నిశ్చలతా పరిస్థితులో మాత్రమె రాముడు అనగా పరమాత్మ శక్తి మూలాధారము వద్దనున్న కుండలినీ శక్తిని జాగృతి చేయగలదు. అప్పుడే మనుష్యజన్మకు సార్ధకత. ధ్యానముచేయని మనుజుడు పశువుకు సమానము. తమతమ దైనందిక పనులు చేసికుంటూ ధ్యానముతో పరమాత్మ సామ్రాజ్యములో ప్రవేశమునకు అర్హత సంపాదించ వలయును.  తత్తదుపరి మనుజులు తమతమ దైనందిక పనులు చేసికుంటూ ధ్యానము తీవ్రతరము చేసికుంటూ పరమాత్మతో ఐక్యము అవ్వవలయును.
సీతా స్వయంవరములో శివ ధనుస్సును విరవబోయి అనగా కుండలినీశక్తిని జాగృతి పరచబోయి  రావణాసురుడు అనగా తీవ్ర అహంకారము భంగపడి అవమానముతో లంకా నగరమునకు అనగా సంసారమునకు తిరిగివెల్తాడు. జనకుడు శాంతమునకు ప్రతీక.  శ్రీరాముడు అనగా సత్వబుద్ధి.
శివ ధనుస్సును విరిచి జనకుని పుత్రిక అనగా శాంతము యొక్క పుత్రిక అయిన సీతను అనగా  కుండలినీశక్తిని వివాహమాడుతాడు అనగా జాగృతి పరచుతాడు. శివ ధనుస్సు అనగా మంగళమయిన మేరుదండము. ఇక్కడ సాధకుడు క్రియాయోగ సాధనకు మేరుదండమును నిఠారుగా ఉంచి మంగళకరమయిన ప్రాణశక్తి నియంత్రణకు శాంతముతో పూనుకుంటాడు. ప్రాణశక్తి ప్రవహిస్తే ఈ శరీరము శివము. లేనియడల శవము.  భరతుడు మాండవిని అనగా క్రియాయోగ సాధనను,  లక్ష్మణుడు ఊర్మిళను అనగా నిద్రను,  శత్రుఘ్నుడు శృతకీర్తిని అనగా కీర్తిని వివాహమాడుతారు.  అనగా సాధకుడు తనలోని అహంకారమును  నిద్రపుచ్చాలి. వైరాగ్యేచ్ఛను కీర్తివంతము అనగా తీవ్రతరము చేయాలి.    పరశురాముని అనగా తీవ్రసాధన కోరికమేరకు అతని ధనుస్సును అనగా మేరుదండములోని బాణమును  సంధించి అనగా రుద్రగ్రంధి విచ్ఛేదన చేసి తన శక్తిని తెలియజెప్పుతాడు.
వశిష్ట - విశ్వామిత్ర వృత్తాంతము:
గాధికొడుకు అయిన విశ్వామిత్రుడు పరాక్రమవంతుడయిన రాజు.  ఆయన ఒకప్పుడు ఒక అక్షౌహిణి సైన్యమును వెంటబెట్టుకొని వశిష్టుని ఆశ్రమమునకు వచ్చెను. వశిష్టుడు ఆ రాజుకు ఆయన సైన్యమునకు ఆతిథ్యమును ఇవ్వదలంచెను. దానికి ఆ విశ్వామిత్ర మహారాజు సమ్మతించెను. అప్పుడు వశిష్టుడు తన కామధేనువు పరవర్నినియగు శబలుని దయతో వారందరికీ భోజనాదులను సమకూర్చెను.  ఆశ్చర్యపోయిన ఆ మహారాజు ఆ కామధేనువును తనకిమ్మని, దానికి బదులుగా లక్ష ఆవులను ఇచ్చెదను అని అడిగెను. వశిష్టుడు ససేమిరా ఇవ్వనుగాక ఇవ్వనుఅనటముతో క్రోధితుడయిన విశ్వామిత్ర మహారాజు ఆయన మీద వివిధములయిన అస్త్రములతో యుద్ధము చేసెను.  తన బ్రహ్మదండమునెత్తి విశ్వామిత్రునితో ఇట్లనెను.
క్వ చ తే క్షత్రియబలం క్వ చ బ్రహ్మబలం మహత్
పశ్య బ్రహ్మబలం దివ్యం మామ క్షత్రియ పాంసన             ------- 27
విశ్వామిత్రా, మీయొక్క క్షత్రియబలము ఎక్కడ? మహత్తరమయిన బ్రహ్మబలము ఎక్కడ? నా యొక్క బ్రహ్మబలమును వీక్షింపుడు’, అనెను.
ఆ బ్రహ్మదండము ముందర విశ్వామిత్రుని క్షత్రియబలము వీగిపోయెను.
ధిగ్ బలం క్షత్రియబలం  బ్రహ్మతేజోబలం బలం
ఏకేన బ్రహ్మదండేన సర్వశాస్త్రాణి హతాని మే   -----------        28
విశ్వామిత్రుడు ఇట్లనెను:
క్షత్రియబలం ఓడిపొయినది. బ్రహ్మతేజోబలమే యదార్థమయిన బలము.  ఎందుకంటే ఈరోజు ఒక్క బ్రహ్మదండము నా అస్త్రములన్నిటినీ నాశనము చేసినది.
కాబట్టి బ్రహ్మజ్ఞాన బలము ముందర మానవ క్షత్రియబలము  ఓడిపోక తప్పదు.
తదేతత్ ప్రసమీక్ష్యాహం ప్రసన్నేంద్రియ మానసః
తపో మహత్ సమస్థాస్యే యద్ వై బ్రహ్మత్వ కారణం   ----------  29
ఈ విషయమును ప్రత్యక్షముగా చూచితిని. నేను నా ఇంద్రియములను మనస్సును నిర్మలము చేసికుంటాను. బ్రహ్మజ్ఞానమునొసంగు గొప్ప తపస్సును ఆచరించెదను.
ఏష రామ మునిశ్రేష్ఠ ఏష విగ్రహవాం తవః
ఏష ధర్మః పరో నిత్యం వీర్యస్యైష పరాయణం
ఏవం ఉక్త్వా మహాతేజా విరరామ ద్విజోత్తమః  -------------------- 30
ఓ రామ, ఈ విశ్వామిత్రుడు మునులు అందరిలోనూ శ్రేష్టుడు. మూర్తీభవించిన తపస్సుయొక్క స్వరూపము. ధర్మమూత్రి. పరాక్రమనిది ఈయన. ఈ ప్రకారముగా మహాతేజస్వియు, మరియు బ్రాహ్మణోత్తముడును అగు శతానందుడు పలికెను.
అప్పుడు జనకమహారాజు ఇట్లనెను:
భగవాన్ స్వాగతం తేస్తు కిం కరోమి తవానఘ
భవాన్ ఆజ్ఞాపయతు మాం ఆజ్ఞాప్యో భవతాం అహం   ----------   31
మహాత్మా, తమకు స్వాగతము, పాపరహితుడగు ఓ మహర్షి, నన్ను ఆజ్ఞాపించుడు. నేను ఎట్టి సేవ చేయవలయును? ఎందుకంటే నేను మీయొక్క ఆజ్ఞాపాలకుడను అయి ఉన్నాను.
విశ్వామిత్రః సరామస్తు శ్రుత్వా జనకభాషితం
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవం అబ్రవీత్     ---------  32
జనకుని మాటలు విని విశ్వామిత్రమహర్షి శ్రీరామునితో ఇట్లనెను: నాయనా, శ్రీరామచంద్ర, ఈ ధనుస్సును చూడుము.
అంత శ్రీరాముడు పెట్టె తెరిచి దానిలోనున్న ధనుస్సును పైకెత్తెను. ఎక్కు పెట్టెను. అది విరిగిపోఎను.  జనకుడు సతొషించి తనకు ముఖ్యులయినవారిని, మరియు దగ్గరి వారిని అయోధ్యకు పంపెను. దశరథుడు మొదలయినవారు నాలుగు దినములు ప్రయాణము చేసి మిథిలా పట్టణము చేరిరి. జనక మహారాజు వారికి స్వాగత సత్కార్యములను చేసెను.
అథ రామో మహాతేజా లక్ష్మణేనసమం యయౌ
విశ్వామిత్రం పురస్కృత్య పితుః పాదా వుపస్పృశన్    --------- 33
అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడిని వెంటబెట్టుకొనెను. విశ్వామిత్రమహర్షిని తోడురాగా   తండ్రివద్దకేగి పాదములను త్రాకి దణ్ణము పెట్టుకొనెను.
తదుపరి జనకమహారాజు సతీ సమేతముగా మహాపతివ్రత అయిన సీతమ్మను తీసుకొని వచ్చెను. అమ్మను రామయ్య చేతిలో పెట్టి పాణిగ్రహణమొనర్చెను.
మహాపతివ్రత అయిన మాండవిని భరతుని చేతిలో పెట్టి పాణిగ్రహణమొనర్చెను.
మహాపతివ్రత అయిన ఊర్మిళమ్మను లక్ష్మణుని చేతిలో పెట్టి పాణిగ్రహణమొనర్చెను.
మహాపతివ్రత అయిన సీతమ్మను రామయ్య చేతిలో పెట్టి పాణిగ్రహణమొనర్చెను.
మహాపతివ్రత అయిన శ్రుతకీర్తిని శత్రుఘ్నుని  చేతిలో పెట్టి పాణిగ్రహణమొనర్చెను.
తదుపరి ఆ రాజకుమారులు తమతమ భార్యలతో సహా దశరథునికి, జనకునికి, ఋషులకు, మునులకు, అగ్నికి, వేదికి, ప్రదక్షిణమొనర్చి వేదోక్తవిది ననుసరించి వైవాహిక కార్యమును పూర్తీ చేసిరి. 
విశ్వామిత్రమహర్షి ఉత్తరాపర్వతమునకు బయల్దేరి వెళ్ళిరి.
దశరథమహారాజు తనపరివారముతో అయోధ్యకి బయల్దేరారు. భృగుకుల నందనుడును, జమదగ్ని కుమారుడును అగు పరశురాముడు ఎదురుగా వచ్చెను. పరశురాముడు ఇట్లనెను: ఓ శ్రీరామా, ఇది పరశురాముని ధనుస్సు. మీరు దీనిని లాగి బాణమును సంధింపుడు’.  దానికి శ్రీరాముడు ఆ ధనుస్సును గైకొని బాణమును సంధించెను.
ఈ విధముగా పరమేశ్వర జ్ఞానశక్తి శాంతస్వరూపుడగు శ్రీరాముని లోనికి ప్రవేశించెను.
శాంతస్వరూపుడగు సాధకుడినే జ్ఞానశక్తి వరిస్తుంది.
రామం దాశరథిం రామో జామదగ్న్యః ప్రపూజితః
తతః ప్రదక్షిణీ కృత్వా జగమాత్మ గతిం ప్రభుః  ---------------  34
అటుపిమ్మట శ్రీరాముడు పరశురాముని పూజించెను. అట్లు పూజితుడై పరశురాముడు శ్రీరామునకు ప్రదక్షిణమొనర్చెను. తన స్థానమునకు వెడలిపోయెను.
పరశురాముడు అనగా జ్ఞాన గొడ్డలి ధరించినవాడు. 

కేకయ రాజు భరతుని మేనమామ. అనగా కైకేయి సోదరుడు.  కేకయ రాజకుమారుడి పేరు యుథాజిత్తు. కైకేయిపుత్రుడు భరతుడు. భరతుడు మరియు సుమిత్రాదేవి కుమారుడయిన శత్రుఘ్నులు ఇద్దరూ యుథాజిత్తుతో కలిసి మేనమామ ఇంటికి వెళ్ళిరి.

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana