అష్టాదశ పురాణములు సారాంశము





­­­­­­­­­­­­
పూజ్యగురుదేవులు
శ్రీశ్రీ పరమహంస యోగానంద పాదపద్మములకు
అంకితం






                           తల్లిదండ్రులకు నమస్కారములు
                        కౌతా సుబ్బారావు    శ్రీమతి శ్యామలాంబ  


కొత్తపల్లి రామపూర్ణచంద్రరావు, శ్రీమతి కనకదుర్గ












            
                  ఓం శ్రీ యోగానందగురుపరబ్రహ్మణేనమః
                                  ముందుమాట
క్రియాయోగము అద్భుతమైనది. రామాయణ మహాభారత భాగవత అష్టాదశ పురాణములలో  గూఢముగా నిక్షిప్తమయినది ఈ క్రియాయోగమే. ఈ గ్రంధములకు వివిధములయిన వ్యాఖ్యానములు వచ్చినవి. కేవలము ఈ గ్రంధముల ప్రకటనార్థములవలన పాఠకుడు తృప్తిజెందలేడు. ఆ గ్రంధములు క్రియాయోగ దృష్టిలో వ్రాయబడినవని నేను నా ధ్యానములో గ్రహించితిని. అందువలన ఆయా గ్రంధములలోని ఇతివృత్తములను తీసికొని యోగపరమయిన అర్థమును ఉటంకించితిని. నా ఈ ప్రయత్నమును పాఠకులు అర్ధము చేసికొని ఆశీర్వదించుదురని ఆశిస్తున్నాను. 
                                                         కౌతా మార్కండేయ శాస్త్రి.


నవ్వు కి ఖర్చు లేదు.  కాని ఎంతో విలువ అయినది. ఇచ్చే వారు దానివలన బీదవారు అవరు .  కానీ పుచ్చుకొనేవారు భాగ్యవంతులు అవుతారు.  నవ్వుకి పట్టేది ఒక్క క్షణం.  కానీ దాని తీపిగుర్తు ఒక్కోసారి ఎప్పటికీ ఉండిపోతుంది.  

 

 

గాయత్రిమంత్రము

గాయంత్రం త్రాయతే ఇతి గాయత్రి: 
అనగా పాడుతున్నకొలది సాధకుడిని రక్షించును గనుక గాయత్రి అందురు.
న మాతా పరదైవం న గాయత్రి పరమంత్రం అనగా తల్లిని మించిన దైవము,  గాయత్రిని మించిన మంత్రము లేదు. 
ఓం భూర్భువస్సువః తత్ సవితర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధీయోయోనః ప్రచోదయాత్
ఓం = బ్రహ్మ  భూః = ప్రణవ స్వరూపము  భువః = దుఃఖ నాశనము
స్వః = సుఖ స్వరూపము  తత్ = ఆ   సవితుః = తేజస్సుచే    దేవస్య = దేవునియొక్క వరేణ్యం = శ్రేష్ఠమైన భర్గః = పాపనాశమైన తేజమును  ధీమహి = ధ్యానింతుము యః = ఏదైతే  నః =  మాయొక్క  ధియః = బుద్ధులను ప్రచోదయాతు = ప్రేరేపించుగాక.
ఓంకారము   పరబ్రహ్మము.  ప్రణవ స్వరూపము. దుఃఖ నాశనము. సుఖ స్వరూపము. ఆ ఓంకార తేజస్సుచే దేవునియొక్క శ్రేష్ఠమైన పాపనాశమైన తేజమును ధ్యానింతుము. అది మా బుద్ధులను ప్రేరేపించుగాక.


మహాభారతము గీత: 
ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. అందువలన రాజ్యమును పాండురాజు పరిపాలించాడు. పాండురాజుకు కుంతి మరియు మాద్రి అని ఇద్దరు భార్యలు. వారి కుమారులు పాండవులు. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు.  అసూయనే  పురుగు దుర్యోధనుని అంతఃకరణములో ప్రవేశించినది. అతను శకుని మున్నగు వారి సహాయముతో వక్రమార్గమున ధర్మరాజుని అతని సోదరులను జూదమున ఓడిస్తాడు. వారిరాజ్యమును కాజేస్తాడు. వారిని 12  సంవత్సరముల వనవాసము, ఒకసంవత్సరము అజ్ఞాత వాసముచేయిస్తాడు. అప్పటికీ వారిరాజ్యమును వారలకు ఇచ్చుటకు ఒప్పుకోడు. సూదిమోపినంత స్థలముకూడా ఇవ్వనంటాడు. తదుపరి శ్రీ కృష్ణుడు రాయబారము చేస్తాడు. ప్రయోజనముండదు. కురుక్షేత్ర సంగ్రామం అనివార్యమైంది. ధర్మక్షేత్రమైన.కురుక్షేత్రములో పాణ్డవ కౌరవ సేనలు బారులుతీర్చి నిలబడియున్నవి. అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు రెండుసేనలమధ్య తమ రథమును నిలబెట్టెను. అప్పుడు ఆ సేనల మధ్యనున్న అన్నలు, తమ్ములు, మామలు, మేనమామలు, బావలు, బావమరిదులు, తండ్రులు, తాతలు, గురువులు మున్నగువారినిజూచి విలపించుచూ ఈ బంధువులనుజంపి రాజ్యము సంపాదించుటకంటే వేరే పాపము ఏమన్నా యున్నదా? నాకు కర్తవ్యాన్నిబోధించమని అడుగుతాడు. దాని ఫలితమే గీత.

 

మహాభారతములోని పాత్రలకు అర్థము.
అక్షౌహిణి = 21870 ఏనుగులు,  
              21870 రథములు,
              65610 గుఱ్ఱములు, 
              109350 కాల్బంట్లు
ఈ పైవన్నీ సాధకుడు తన సాధనలో ఎదుర్కొనే అనుకూల, ప్రతికూల శక్తులు.             
కురుక్షేత్రముమూలాధార,స్వాధిష్ఠాన,మణిపురచక్రములు
కురుక్షేత్రధర్మక్షేత్రముమణిపుర, అనాహత, విశుద్ధ చక్రములు
ధర్మక్షేత్రమువిశుద్ధ, ఆజ్ఞా, సహస్రారచక్రములు
రథముశరీరము
సారథిశ్రీకృష్ణుడు, శుద్ధబుద్ధి, సహజాత్మావబోధ, గురువు.
అర్జునుడురథికుడు  (సాధకుడు)
గుఱ్ఱములుఇంద్రియములు
కళ్ళెముమనస్సు
కౌరవులుకామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాదిదుర్గుణములు
పాండవులుమూలాధార,స్వాధిష్ఠాన,మణిపుర అనాహత, విశుద్ధ  చక్రములు.
ద్రౌపదికుండలినీ శక్తి
మొదటిఆరు అధ్యాయములు కర్మషట్కము (శ్రవణము)
రెండవ ఆరు అధ్యాయములుభక్తిషట్కము (మననము)
చివరి ఆరు అధ్యాయములుజ్ఞానషట్కము (నిధిధ్యాసనము)

               శంతనుడు (నిశ్చల పరమాత్మ)
శం= మంగళకరమైన, తనుడు=శరీరముగలవాడు.
గంగ (మొదటి భార్య)= మొట్ట మొదటి ప్రకృతి చైతన్యము
సత్యవతి (రెండవ భార్య) = మొట్ట మొదటి ప్రకృతి పదార్థము
కూటస్థ చైతన్యము= సృష్టిలోని పరమాత్మ
కూటస్థ చైతన్యము తనను తాను ఆరు విధములుగా విభజించు కున్నది. అవి సమిష్టి కారణ, వ్యష్టి కారణ, సమిష్టి సూక్ష్మ,  వ్యష్టి సూక్ష్మ, సమిష్టి స్థూల, వ్యష్టి స్థూల, చైతన్యములు. ఇవికాక ఆఖరిది అయిన ఆభాస చైతన్యము ఒక్కటి మాత్రమె సాధారణ కంటికి కనబడు ప్రకృతికి కారణము అయినది.  దానినే బ్రహ్మాండ అహంకారము లేదా భీష్ముడు అనేది. వీరందరూ గంగ మరియు శంతనుల ఎనిమిదిమంది బిడ్డలు.
సత్యవతికి ముగ్గురు బిడ్డలు వారు వ్యాస, చిత్రాంగదుడు, మరియు విచిత్రవీర్యుడు.
వ్యాసుడు:  యుక్తాయుక్త విచక్షణాజ్ఞానముగల బుద్ధి,
చిత్రాంగదుడు= చిత్త లేదా మహత్తత్వ, అనగా స్థూల ప్రకృతికి కావలసిన ఇరువదినాలుగు తత్వములు.   ద్వైతమునకు బీజము పడేది ఇక్కడే.
విచిత్రవీర్యుడు= కారణశరీర సంబంధిత దివ్యమైన అహంకారం. దీని వలననే  పరమాత్మవేరు, ఆత్మ వేరు, అనే భావనకి అంకురం పడేది.
విచిత్రవీర్యునికి ఇద్దరు భార్యలు, వారు అంబిక మరియు అంబాలిక.
అంబిక మరియు అంబాలికల అక్క అంబ. అవివాహిత. ఆవిడే
తరువాత శిఖండి అయినది.
సకారాత్మక అనగా అనుకూల, నకారాత్మక అనగా ప్రతికూలమైన శక్తులు. 
అంబిక= మొదటి భార్య. నకారాత్మక సందేహము.
అంబాలిక = రెండవ భార్య. సకారాత్మక సందేహము.
అంబ(శిఖండి): తటస్థత
యుద్ధధర్మం ప్రకారము నిరాయుధుడితోను, తటస్థుడి తోను, యుద్ధవీరుడైన భీష్ముడు యుద్ధము చేయడు. ఇది భౌతికమైన అర్థము.
భీష్ముడు అహంకారమునకు ప్రతీక. దేని మీదను  నాది అనే మమకారములేక మిన్నకుండుటయే తటస్థత.   తటస్థముగా యండే సాధకునిపై నేను, నాది అనే తత్వమున్న అహంకారము ఏమీ చేయలేదు అనగా దానిప్రభావము శూన్యం. .ఇది ఆధ్యాత్మికమైన వివరణ.   .
అంబికకి ఒక్క  కొడుకు .  ధృతరాష్ట్రుడు.
ధృతరాష్ట్రుడు = విషయాసక్తితో గుడ్డిదైన ఇంద్రియములకు బానిస అయిన మనస్సు.
అంబాలికకి ఒక్క కొడుకు. పాండు
పాండు = విచక్షణాజ్ఞానంగల శుద్ధ బుద్ధి.
ధృతరాష్ట్రునికి ఇద్దరు భార్యలు. గాంధారి(మొదటి భార్య) మరియు వైష్య(రెండవ భార్య).
గాంధారి= కోరికలకి ఊతమునిచ్చే శక్తి.
వైష్య= కోరికల పైన తగులుబాటు. 
పాండుకి ఇద్దరు భార్యలు. కుంతి (మొదటి భార్య) మరియు మాద్రి. (రెండవ భార్య).
కుంతి = వైరాగ్య శక్తి
మాద్రి= వైరాగ్యముపై తగులుబాటు.
గాంధారికి దుర్యోధన(కామము), దుశ్శాసన(క్రోధము) మొదలగు నూరుగురు పుత్రులు.
వైష్యకి ఒక్క కొడుకు. యుయుత్సు. మానసికమైన యుద్ధము చేయునిచ్చ. కురు క్షేత్ర యుద్ధములో యుయుత్సు పాండవులవైపే యుద్ధము చేస్తాడు. కౌరవులను ఎదిరిస్తాడు.
1.దుర్యోధనుడు(మొదటివాడు),2)దుశ్శాసనుడు,3)దుస్సాహుడు,  
4)దుశ్శాలుడు, 5)జలగంధుడు, 6)సముడు, 7)సహుడు, 8)వింధుడు, 
9)అనువింధుడు,10)దుర్దర్శనుడు,11)సుబాహు,12)దుష్ప్రదర్శనుడు, 
13)దుర్మర్షణుడు, 14)దుర్ముఖుఁడు, 15)దుష్కర్ణుడు, 16)వికర్ణుడు,
17)సాలుడు, 18)సత్వనుడు, 19)సులోచనుడు, 20)చిత్రుడు, 21)ఉప చిత్రుడు 22)చిత్రాక్షుడు, 23)చారుచిత్రుడు, 24)సరాససనుడు, 25)దుర్మదుడు, 26)దుర్విగాహుడు, 27)వివిల్సు, 28)వికటనందుడు,
29)ఊర్ణనాభుడు, 30)సునాభుఁడు, 31)నందుడు, 32)ఉపనందుడు,
33)చిత్రబానుడు,34)చిత్రవర్మ,35)సువర్ముడు,36)దుర్విమోచుడు,
37)అయోబాహుడు, 38)మహాబాహుడు, 39)చిత్రాంగుడు, 40)చిత్రకుండలుడు, 41)భీమవేగుడు, 42)భీమబలుడు, 43)వాలకి,
44)బలవర్ధనుడు,45)ఉగ్రాయుధుడు,46)సుషేణుడు,47)కుందాధరుడు
48)మహోదరుడు, 49)చిత్రాయుధుడు, 50)నిసంగి, 51)పాశి,
52)బృందారకుడు, 53)దృఢవర్మ, 54)దృఢక్షత్రుడు, 55)సోమకీర్తి,
56)అంథుదరుడు, 57)దృఢసంధుడు, 58)జరాసంధుడు, 59)సత్య సంధుడు, 60)సదాసువాక్కుడు, 61)ఉగ్రశ్రవుడు, 62)ఉగ్రసేనుడు,
63)సేనాని, 64)దుష్పరాయనుడు,65)అపరాజితుడు,66)కుంధశాయి, 
67)విశాలాక్షుడు,68)దురాధరుడు,69)దృఢహస్తుడు,70)సుహస్తుడు,
71)వాతవేగుడు, 72)సువర్చుడు, 73)ఆదిత్యకేతు, 74)బహువాసి, 
75)నాగదత్తుడు, 76)ఉగ్రసాయి, 77)కవచి, 78)క్రధనుడు,7 9)కుంధి,
80)భీమవిక్రుడు, 81)ధనుర్ధారుడు, 82)వీరబాహు, 83)ఆలోలుపుడు,
84)అభయుడు, 85)ధృఢకర్మావు, 86)ధృఢరథాశ్రయుడు,
87)అనాధృష్యుడు, 88)కుంధభేది, 89)వైరవి ,90)చిత్రకుంధలుడు,
91)ప్రమాధుడు, 92)అమప్రమాధి, 93)దీర్ఘరోముడు, 94)సువీర్య వంతుడు, 95)దీర్ఘబాహు, 96)సుజాతుడు, 97)కాంచనధ్వజుడు, 
98)కుంధాసి, 99)విరాజస్ మరియు 100. యుయుత్సు (వీడొక్కడే మిగిలినది).
కుంతికి ముగ్గురు కొడుకులు. ధర్మరాజు, భీముడు మరియు అర్జునుడు.
మాద్రి.కి ఇద్దరు కొడుకులు. నకులుడు మరియు సహదేవుడు.
ధర్మరాజు== ఆకాశతత్వము,
భీముడు= వాయు తత్వము, 
అర్జునుడు= అగ్ని తత్వము,
నకులుడు= జల తత్వము, 
సహదేవుడు=. పృథ్వీతత్వము,
వీరి ఐదుగురి భార్య ద్రౌపది= కులకుండలినీశక్తి.
ఇది ముడ్డిక్రింద మూడున్నర చుట్టలు చుట్టుకొని నిద్రాణమైయున్న స్థితిలోనున్న ప్రాణశక్తి.
సాధనచేయు యోగియొక్క చక్రములను శక్తివంతము చేయునది మేల్కొన్నకుండలినీ శక్తి.
మనిషి లోని చెడు సంస్కారములు స్థిరపడుటకు మరియు తనలోని పరమాత్మ ప్రసాదించిన ఇచ్ఛాశక్తి బలహీనపడుటకు పన్నెండు సంవత్సరముల కాలము పట్టును. తిరిగి ఆబలహీనపడిన  ఇచ్ఛాశక్తినిశక్తివంతము చేసి సంస్కారములను సరిఅయిన మార్గము లో పెట్టుటకు పన్నెండు సంవత్సరముల తీవ్ర యోగసాధన కావలె ను. అదే పాండవుల పన్నెండు సంవత్సరముల అరణ్యవాసము. పదమూడవ సంవత్సరము సాధకుడు సంసారము లేక ప్రాపంచిక స్పృహ తగ్గించి ఏకాంతములో తీవ్ర యోగసాధన చేసి సమాధి స్థితి పొందుటయే అజ్ఞాతవాసము.
 దీనికై సహాయపడేవి:
మంచి అలవాట్లు,
ఆధ్యాత్మిక ఇచ్ఛ( సేన),
సహదేవుడుమూలాధారచక్రము, నకారాత్మశక్తులను అడ్డుకునే దివ్యశక్తి. 
నకులుడుస్వాధిష్ఠానచక్రము, ఆధ్యాత్మికను అంటిపెట్టుకునే దివ్యశక్తి. 
అర్జునుడుమణిపురచక్రము, నిర్మోహముతోకూడిన ఆత్మనిగ్రహ దివ్యశక్తి. 
భీముడుఅనాహతచక్రము,ప్రాణశక్తినినియంత్రించేదివ్యశక్తి.  మరియు ధర్మరాజువిశుద్ధచక్రము, శాంతి, ప్రశాంతిని ప్రసాదించే దివ్యశక్తి.
శ్రీకృష్ణుడుఆజ్ఞాచక్రము, ఇది భ్రూమధ్యములోని కూటస్థములో నున్నది. సహజాత్మావబోధ, గురువు.
పరమాత్మసహస్రారచక్రము, సాక్షీభూతుడైన పరమాత్మ.
మహాభారతముచైతన్యమూర్తియైన పరమాత్మయొక్క గొప్ప ప్రకాశము.   
కాని రాక్షస శక్తులయిన కౌరవులు వారి చెడు అలవాట్లు(కౌరవసేన) సాధకుని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.  వీటిని శక్తిహీనులను చేసి దైవసామ్రాజ్యమును పొందుటకై జరుగుచున్నదే ఈ మహాభారత  యుద్ధము.  ఆయుద్ధమే క్రియాయోగాసాధన.
ఆసాధనలో ఆజ్ఞాచక్రము లోని కూటస్థమునందున్న  గురువు అయిన శ్రీకృష్ణుని సహాయముతో  ధ్యానముతో వచ్చే సహజావబోధ యొక్క సహాయముతో విజయము అనగా పరమాత్మతో అనుసంధా నత సాధించి తీరవలెను. మూలాధారచక్రమును ఆనుకొని నిద్రాణమై యున్న  కుండలినీశక్తిని మేల్కొలిపి సుషుమ్నా ద్వారా పరమాత్మ (సహస్రారచక్రము) వద్దకు చేర్చటమే దైవసామ్రాజ్యమును పొందటము.
ఉపపాండవులు: మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత మరియు విశుద్ధ చక్రముల కేంద్రములు.
వీరు ఐదుగురు. 1) ప్రతివింద్యుడు. ఈయన ధర్మరాజు కుమారుడు.
2)శ్రుతసోముడు. ఈయన భీముని కుమారుడు. 
3)శ్రుతకీర్తి. ఈయన అర్జునుని కుమారుడు.
4) శతానీకుడు. ఈయన నకులుని కుమారుడు.
5) శ్రుతసేనుడు. ఈయన సహదేవుని కుమారుడు.    
రాక్షసశక్తులయిన ధృతరాష్ట్ర (పూర్తిగా మోహముతో గుడ్డిదైన మనస్సు)  సంతానమయిన  కౌరవులలో కొంతమందిని ఈ క్రింద ఇవ్వడమయినది.
భౌతికవిషయవాంఛ, కోపము, లోభము, లోభత్వము, ద్వేషము, అసూయ, దుష్టబుద్ధి, కామము, స్త్రీవాంఛ, నిందించటము,, సంకరము, నిజాయితీ లేకబోవటము, నీచత్వము, క్రూరత్వం, చెడు ఆలోచన, ఇతరులని బాధించుట, నాశనముచేసే కోరిక,ఇతరులను నాశనముచేసేతలంపు, నిర్దయ, మాట మరియు ఆలోచనలలో క్రూరత్వము, ఓర్పు లేకుండుట, కపటత్వము, స్వార్థము, గర్వముగా ఉండుట, మోసముచేయుట, కులము లేదా సాంఘిక హోదాలమీద గర్వము, గొప్పజాతిననేగర్వము, నేను కులీనుడను అనే తప్పుడు  అభిప్రాయము, ఎక్కువగా గర్వముతో ఉండుట, చిరుబురులాడు తత్వము, సిగ్గుమాలినతనము, దుష్ట భావన, పోట్లాడే స్వభావము, సరళముగా ఉండకుండుట, పగతీర్చుకొనేస్వభావము, ప్రతిదానికి బాధపడే స్వభావము, భౌతిక బద్దకం, చొరవలేకుండుట, పిరికితనం, మరుపు, మానసిక అలసట, ఆధ్యాత్మిక నిర్లిప్తత, ధ్యానమంటే విసుగుదల, ఆధ్యాత్మిక ఆలస్యము, భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆశుద్ధత, భగవంతునిపై విధేయత లేకుండుట, భగవంతునికి  కృతజ్ఞత తెలుపకుండుట, దైవద్రోహం, బుద్ధిలేనితనము, మానసిక బలహీనత, రోగ భయము, దూరదృష్టి లేకుండుట, ఇరుకైనమనస్సు, నిశిత దృష్టి లేకుండుట, భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక అజ్ఞానము, మనస్సుకు నచ్చినట్లు ఆలోచనలేకుండా చేయుట, చంచలమైనఆలోచనలు కలిగియుండుట, ఇంద్రియలోలత, చెడుచెప్పుటకు ఇష్టపడుట, చెడు వినుటకు ఇష్టపడుట, చెడు రుచి చూచుటకు ఇష్టపడుట, చెడు వాసన  ఇష్టపడుట, చెడు తాకుటకు ఇష్టపడుట, చెడు ఆలోచించుటకు, అనుభవించుటకు, మాటలాడుటకు, గుర్తు తెచ్చుకొనుటకు, మరియు చేయుటకు ఇష్టపడుట, వ్యాధి మరియు మరణ భయము, విచారం, మూఢనమ్మకం, చెడు ప్రమాణములు చేయుట, అమర్యాద, అతినిద్ర, అతిగా తినుట, అప్రస్తుతనటన, మంచిగా ఉన్నట్లు నటించుట, పక్షపాతము, కపటత్వము సందేహము, ఒకే విధముగా మూడీగా ఉండుట, నిరాశ, కఠినత్వము, అసంతృప్తి, నాస్తికత్వము, మరియు ధ్యానమును వాయిదా వేయుచుండుట. 
అష్టాదశ పురాణములు సారాంశము:
ఈ అష్టాదశ పురాణములలో శివపురాణము లేదు.  అయినను అదిగూడా దీనిలో చేర్చి దానిని గురించికూడా క్లుప్తముగా విశదీకరించడడమయినది. 


క్రియాయోగము:
క్రియాయోగములో1)హఠయోగం(శక్తిపూరక అభ్యాసములు), 2)లయయోగము(సోహం మరియు ఓం ప్రక్రియలు), 3)కర్మయోగము(సేవ),4)మంత్రయోగము(చక్రములలోబీజాక్షరధ్యానము)మరియు 5)రాజయోగము(ప్రాణాయామ పద్ధతులు) ఉండును. అన్నియోగముల సమ్మేళనమేక్రియాయోగము.
మన శరీరములో 72,000  సూక్ష్మనాడులు ఉన్నవి. వాటిలో ఇడా పింగళ మరియు సుషుమ్న   సూక్ష్మనాడులు అతి ముఖ్యమయినవి. మేరుదండములో ఎడమ ప్రక్కనున్నది ఇడాసూక్ష్మనాడి, కుడిప్రక్కనున్నది పింగళ సూక్ష్మనాడి, మేరుదండము మధ్యలోనున్నది సుషుమ్న   సూక్ష్మనాడి. మన శరీరములోని మేరుదండములో ఏడు చక్రములున్నవి. ముడ్డివద్దనున్నమూలాదారచక్రము మొదటిది. మూత్రవిసర్జనద్వారమువెనకాలఉన్న స్వాధిష్ఠాన చక్రము రెండవది. నాభివెనకాల ఉన్న మణిపురచక్రము మూడవది. హృదయము దగ్గరగా మేరుదండములో నున్న అనాహతచక్రము నాలుగవది. కంఠములోనున్న విశుద్ధచక్రము అయిదవది. మెడుల్లకేంద్రమువద్దనున్నది ఆజ్ఞా నెగటివ్, భ్రూమధ్యములోనున్నది ఆజ్ఞా పాజిటివ్ చక్రము. ఈ ఆజ్ఞా నెగటివ్, మరియు భ్రూమధ్యములోనున్న ఆజ్ఞా పాజిటివ్ రెండునూ కలిపి ఆరవచక్రమయిన ఆజ్ఞాచక్రము. ఈఒక్కచక్రమునకు మాత్రము నెగటివ్, పాజిటివ్ పొలారిటీలు ఉండును. తలలో బ్రహ్మరంధ్రమునానుకొని ఏడవదయిన సహస్రారచక్రము ఉండును.
మూలాదారచక్రము స్వాధిష్ఠాన చక్రము మణిపురచక్రము అనాహతచక్రము విశుద్ధచక్రము ఆజ్ఞా నెగటివ్,  ఆజ్ఞా పాజిటివ్ చక్రము, మరియు సహస్రారచక్రము అనేది ఆరోహణాక్రమము.
సహస్రారచక్రము ఆజ్ఞా పాజిటివ్ చక్రము ఆజ్ఞా నెగటివ్ విశుద్ధచక్రము అనాహతచక్రము మణిపురచక్రము స్వాధిష్ఠాన చక్రము మరియు మూలాదారచక్రము అనేది అవరోహణాక్రమము.
మూలాదారచక్రము స్వాధిష్ఠాన చక్రము మణిపురచక్రము వరకు వ్యాప్తించియున్నది బ్రహ్మగ్రంథి. ఇదియే కురుక్షేత్రము. ఋగ్వేద కాలము.
మణిపురచక్రము అనాహతచక్రము విశుద్ధచక్రము వరకు వ్యాప్తించియున్నది రుద్రగ్రంథి. ఇదియే కురుక్షేత్ర - ధర్మక్షేత్రము. యజుర్వేదకాలము
విశుద్ధచక్రము ఆజ్ఞా నెగటివ్,  ఆజ్ఞా పాజిటివ్ చక్రము, మరియు సహస్రారచక్రము వరకు వ్యాప్తించియున్నది విష్ణుగ్రంథి. ఇదియే ధర్మక్షేత్రము. సామవేద కాలము.
క్రియాయోగం:
చకోరపక్షి:  అమావాస్య నుండి పౌర్ణమి వరకు 15 రోజుల శుక్ల పక్షములో, ఈవ్రతముపాటించేవారు అమావాస్యనాడు ఏమీ తినగూడదు. పాడ్యమి నుండి ఒక్క కబళము, విదియనాడు రెండుచొప్పున,  అలా పెంచుకుంటూపోయి పౌర్ణమినాడు15 కబళములు తింటారు.  పౌర్ణమి నుండి అమావాస్య వరకు 15 రోజుల కృష్ణపక్షములో, క్రమముగా, ఒక్కొక్క కబళము చొప్పున, తగ్గించు కుంటూఅమావాస్యనాడు ఏమీ తినరు. దీనినికృఛ్ర చాన్ద్రాయనవ్రతము అంటారు. చకోరపక్షి ఈ నియమమును పాటిస్తుంది.  కృఛ్ర చాన్ద్రాయనవ్రతమును పాటించేపక్షి ఇదేనేమో అని పిస్తుంది. అందు వలన దీనికొక ప్రతేకత ఉన్నది   ఆధ్యాత్మికంలో. పరమాత్మపొందుకై సాధకులు ఆహారనియమములు పాటించుటకై ఈ పక్షిని ఆదర్శముగా పేర్కొంటారు.
జాతకపక్షి. తల్లిపక్షి ఆకాశములో ఎగురుతూ గుడ్డును జార విడుస్తుంది.  ఆగుడ్డు క్రిందపడుతూ భూమిని తాకేలోపల పక్షి అయ్యి తిరిగి పైకి ఎగురుతుంది. బిడ్డ పక్షికి వానచినుకులు ఆహారము. కంఠములో కంత ఉంటుంది. తల్లిపక్షి బిడ్డని ఆ కంఠములోని కంతలో వానచినుకులు పడేటట్లుగా  తల్లక్రిందులుగా పట్టుకొని వానపడే ప్రదేశమువైపుగా తిరుగుతూ ఉంటుంది.
అదేవిధముగా సాధకునకు  ఆపక్షుల ఆహారతపనమాదిరి పరమాత్మ తపన ఉండాలి. సాధన చేయాలి.   
ముని అనగా తన అహంకారమును శాస్త్రీయమైన పద్ధతిలో శుద్ధాత్మక్రింద మార్చి మౌనంగా ఉండిపోయిన యోగిపుంగవుడు.
లోపలికి తీసికొనేప్రాణ  శ్వాస చల్లగా ఉండి చంద్రనాడి అని  బయటికి వెళ్ళే అపాన నిశ్వాస వెచ్చగా ఉండి సూర్యనాడి అని పిలవ బడుతున్నది.  క్రియాయోగసాధకుడు లోపలికి బయటికి వెళ్ళే శ్వాసప్రక్రియయొక్క చల్లదనము మరియు వెచ్చదనము   తన మేరుదండము ద్వారా జరుగుతున్న అనుభూతి చెందుతాడు.             
ప్రాణశక్తికిచేతనమరియుశక్తిరెండూఉండును. ప్రాణశక్తి దేహమంతా వ్యపించియుండును. కాని వివిధభాగములలో వివిధములైన పనులుచేస్తూ వివివిధ నామములతో వ్యక్తమగు చున్నది.
ప్రాణవాయువుగా స్ఫటికీకరణము(Crystallization)నకు అనగా అన్నిపనులవ్యక్తీకరణకుతోడ్పడును.
అపానవాయువుగా అన్నివ్యర్థ పదార్థములవిసర్జన(Elimination)కుతోడ్పడును.వ్యాన వాయువుగా ప్రసరణ(Circulation)కుతోడ్పడును.
సమానవాయువుగా స్పాంజీ కరణ(Assimilation)కుఅనగాఅరుగుదలకు,తద్వారా వివిధకణములకు, అంగములకు కావలసిన పోషకపదార్థముల వితరణ మరియు చచ్చినకణముల స్థానములలో  కొత్తకణములను సృష్టించుటకు  తోడ్పడును.  కేశవృద్ధి, చర్మము, మాంసము మొదలగు వాటికి వివిధ రకములైన కణములు కావలయును. అందుకు అనంతమైన సమీకరణములు జరుగుచుండును. ఆపద్ధతినిజీవాణుపాక అందురు.
ఉదానవాయువుగా జీవాణుపాక(Metabolizing)కు  తోడ్పడును.
ప్రాణ అపాన అనేవి మన శరీరములో రెండు ముఖ్యమైన విద్యుత్తులు.
మొదటిది అపానవిద్యుత్తు. అదిరెండుకళ్ళ మధ్యనున్న  కూటస్థము నుండి మూలాధారము గుండా దానిని ఆనుకొని క్రిందయున్న మలద్వారము ద్వారా  బయటకుపోవునది. ఇది చంచలమైనది. మనిషిని ఇంద్రియలోలుడ్ని చేయును.
రెండవది ప్రాణ విద్యుత్తు మలద్వారము గుండా దానిని ఆనుకొనియున్న మూలాధారము ద్వారా కూటస్థమునకు పోవునది. ఇది శాంతియుతమైనది. నిద్ర మరియు ధ్యానసమయము లోనూ, మనిషిఏకాగ్రతను పరమాత్మతో కలుపును. కనుక ఒక విద్యుత్తు మనిషిని క్రిందకు అనగా బాహ్యప్రపంచమునకు లాగును. ఇంకొక విద్యుత్తుమనిషినిపైకిఅనగాలోపలికిఅనగా అంతర్ముఖము చేయును.  సాధనకు అంతర్ముఖముఅగుట తద్వారా పరమాత్మపొందుట సులభమగును. దీనినే క్రియాయోగమందురు. 
ముఖ్యప్రాణము కూటస్థమునుండి మలద్వారము ద్వారా బహిర్గతమగునపుడు కణములు, కండరములు మరియు అంగములు మెదడుకు సమాచారము తీసికెళ్ళుటకు, పట్టుకెళ్ళేందుకు ఉపయోగములోఉండే నరములవలననూ మరియు మానసిక వ్యాపారములవలననూ శక్తి ఖర్చు అగును. అప్పుడు అవి వ్యర్థ లేక కలుషితములను రక్తములో వదిలిపెట్టును. వాటిలో బొగ్గుపులుసు వాయువు (CO2) ఒకటి. ఆ కలుషితరక్తమునువెంటవెంటనేశుద్ధీకరణచేయుట చాలా అవసరము. లేనియడల భౌతికమరణము సంభవించును. ఆఖర్చయినశక్తిని పునరుద్ధరించుటకు శ్వాసద్వారావచ్చు ఈ ముఖ్యప్రాణము అవసరము.
మేరుదండములోని  ప్రాణ అపానముల పరస్పర విరుద్ధమైన ఆకర్షణల వలన శ్వాస నిశ్వాసల ప్రక్రియ జరుగును. ప్రాణశక్తి పైకి పోయినప్పుడు ప్రాణవాయువుతో కూడిన ప్రాణశక్తిని ఊపిరి తిత్తుల లోనికి తీసికొనివెళ్ళి బొగ్గుపులుసు వాయువును వెంటనే  తీసివేయును. దీనినే శ్వాసపీల్చుకోవటం అంటారు.  అదే పొట్టలోని ద్రవ మరియు ఘన పదార్థముల శుద్ధీకరణ చేయుటకు ఎక్కువ సమయము పట్టును. ఆ శుద్ధీకరణ చేసిన శక్తిని కణములలోనికి పంపునది ప్రాణశక్తే. ఈశుద్ధీకరణ చేసిన ప్రాణశక్తి మేరుదండములోని అన్ని చక్రములలోను, కూటస్థము మరియు పెద్దమెదడు అనగా సేరేబ్రంలలోను శక్తిని పునరిద్ధరించుచుండును. శ్వాసలోని మిగులు శక్తిని రక్తము శరీరము మొత్తములోను తీసికెళ్ళుచూఉండును. అక్కడ పంచప్రాణములు వాటికి కావలిసిన రీతిలో ఉపయోగించుకొనును.
క్రియా యోగము ఎవరైనా అభ్యసించవచ్చు. ఈ అభ్యాసముద్వారా సాధకుడు తన మనస్సును ఇంద్రియవిషయములనుండి నిగ్రహించు కోగలుగుతాడు. ఇంద్రియములనుండి ప్రాణశక్తిని ఉప సంహరించుకొని   మనస్సు, బుద్ధి రెండింటినీ ఇంద్రియ ములనుండి నిగ్రహించు కోగలుగుతాడు. మనో,బుద్ధి,చిత్త,అహంకారములను మేరుదండము లోని మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత మరియు విశుద్ధ చక్రములద్వారా ఆరవ చక్రమయిన మెడుల్లా కేంద్రములోని ఆజ్ఞాచక్రములోనికి తీసికెళ్ళగలుగుతాడు.. ఈఆజ్ఞాచక్రము భ్రూమధ్య ములోని మూడవకన్నుకు ఐస్కాంతపుఆకర్షణతో కలిపిఉంటుంది. ఈమూడవ కన్ను పెద్దమెడదు (Cerebrum) కేంద్రములోని సహస్రారచక్రమునకు కలిపిఉంటుంది.  ఆక్కడ  క్రియాయోగి తన  మనో,బుద్ధి,చిత్తములను ఆత్మాగ్నిలో కరిగిపోయి తనను శుద్దాత్మ గాను,గ్రహిస్తాడు.
భౌతికమైన కన్ను తన ముందరి ప్రదేశమును మాత్రమే చూడ గలుగుతుంది.  మూడవకన్ను సూక్ష్మ, కారణలోకములనన్నింటినీ చూపగలదు. మూడవకన్నులోనికిమనస్సునుప్రవేశించగలిగిన క్రియా యోగి ముందుగా తన సూక్ష్మ శరీరమును చూస్తాడు. ఆ తరువాత మొత్తము సూక్ష్మలోకమును, ఆలోకములోని తన శరీరముకూడా ఒక భాగముగా చూస్తాడు. మూడవకన్నులోనికిప్రవేశించకుండా, తన ప్రాణశక్తిని, చేతనను మేరుదండములోనికి, దానిలోని చక్రములలోనికి ప్రవేశింపజేయలేడు.ఆ తరువాత ముక్తిపొందుతాడు సాధకుడు. 
క్రియాయోగము:
దైనందిన కార్యక్రమములకు దాదాపు 40వేల ప్రోటీన్స్ అవసరము. ఈ ప్రోటీన్స్ ను వృద్ధిచేసికొని తద్వారా వ్యాధి, ముసలితనము త్వరగా దరిరానీయక కాపాడుతుంది క్రియాయోగము. జీవకణములకు, వాటి సంబంధిత కాలేయము, ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండము లలాంటి అవయవములకు సమన్వయత లోపించడమే రోగములకు కారణము. ఈ సమన్వయత కలగజేయటము క్రియాయోగముద్వారా సుసాధ్యము.
హైడ్రోజన్బాంబ్ (Hydrogen bomb) అనేది ఫ్యూజన్ అనే పద్ధతిమీద ఆధారపడి చేసినది. బాహ్యకుంభకము ఫ్యూజన్ లాంటిది.  రోగగ్రస్త జీవకణములను బాహ్యకుంభకముద్వారా ఆరోగ్యవంతము చేసికొనవచ్చు. ఫ్యూజన్ లో అనగా జీవకణములను బయటనేవదలి శక్తి పుట్టించబడుతుంది.    ఆటమ్బామ్బ్(Atom bomb) అనేది ఫిజన్ అనే పద్ధతిమీద ఆధారపడి చేసినది. అంతఃకుంభకము ఫిజన్ లాంటిది. రోగగ్రస్త జీవకణములను అంతః కుంభకముద్వారా ఆరోగ్యవంతము చేసికొనవచ్చు. ఫిజన్ లో అనగా అంతఃకుంభకములో  జీవకణములను కూటస్థములోని  ఆజ్ఞాచక్ర ములో కుదించి   శక్తిపుట్టించబడుతుంది.
ఇడానాడి గంగ, పింగళనాడి యమున, సుషుమ్నానాడి సరస్వతి. ఈ మూడుసూక్ష్మనాడులు  కూటస్థములో కలవటమే త్రివేణీసంగమము.  మూలాధారమునుండి కుండలినీశక్తి సుషుమ్నానాడి ద్వారా కూటస్థము వరకు అటుపిమ్మట సహస్రారము వరకు చేరుకోవటమే సమాధిస్థితి.
క్రియాయోగము ఒక భౌతిక మానసిక విధానము. ఈయోగములో సాధకుని శరీరములోని రక్తము కర్బనము కోల్పోయి ప్రాణవాయువు తో శక్తివంతమగును. బుర్రలోని జీవకణములు ధనధృవముగాను, మిగిలినశరీరమంతయు ఋణధృవముగాను అవుతుంది. సాధకుడు కూటస్థములోని ఆజ్ఞాచక్రమువరకు శ్వాసపూరకముచేసి, తిరిగి ఆ శ్వాసను మూలాధారముద్వారా పూర్తిగా రేచకముచేసి వదలి విద్యుద యస్కాంతశక్తి పుట్టిస్తాడు. జీవకణనాశనము తగ్గును. హృదయమునకు,  బుర్రలోని నరములకు విశ్రాంతి మరియు శక్తి చేకూరుతుంది.
మూలాధారమునుండి కూటస్థములోని ఆజ్ఞాచక్రమువరకు ఆరు చక్రములున్నవి. ఈ చక్రములలో ప్రతిచక్రమునకు రెండేసి రాశుల చొప్పున పన్నెండురాశులున్నవి.  క్రియాయోగి తనప్రాణశక్తిని మూలా ధారమునుండి కూటస్థములోని ఆజ్ఞాచక్రము వరకు, ఆజ్ఞాచక్రము నుండి మూలాధారమువరకు త్రిప్పుతూ ఒకక్రియచేస్తాడు. అట్లా క్రియాయోగి తనప్రాణశక్తినిత్రిప్పుతూ, ఆత్మసూర్యుని ఈఆరుచక్ర ములలోని పన్నెండురాశులలో దర్శిస్తూ, ప్రతిక్రియకూ ఒక సంవత్సరం చొప్పున తనకర్మను దగ్ధము చేసికుంటాడు.
ఒక్కొక్కరాశికి ఒక్కొక్కమాసముచొప్పున సూర్యుడు పన్నెండురాశుల లో చుట్టిరావటమునకు, ఒక సంవత్సరముపట్టును. మనకు ఒక సంవత్సరముగడచినది అనగా ఒకసంవత్సరము ప్రారబ్ధకర్మము గడచినట్లులెక్క. మన సంచితకర్మము దగ్ధముచేసికొనుటకు పదిలక్ష ల సంవత్సరముల ఆరోగ్యకరమైన జీవితము అవసరము. పట్టుదల గల క్రియాయోగి రోజుకు 1000క్రియలచొప్పున మూడు సంవత్సరము లలో పదిలక్షలక్రియలుచేసి తన సంచితకర్మను దగ్ధము చేసికొని పదిలక్షల సంవత్సరముల ప్రగతి సాధించగలడు. సాధారణముగా, ఒక పధ్ధతి ప్రకారము ఈ క్రియలు చేస్తూఉంటే  6, 12, 18, 24, 30, 36, 42, 48 సంవత్సరములలోపదిలక్షల సంవత్సరముల ప్రగతి సాధించవచ్చు. ఒకవేళ సంపూర్ణమైనప్రగతి సాధించకుండా మరణిస్తే,   క్రియాయోగితనతోపాటేక్రియాయోగసాధనా ఫలితాన్ని తీసికెల్తాడు.
క్రియాయోగిజీవతం అతని సంచితకర్మలతో ప్రభావితముకాదు. అది పూర్తిగా ఆత్మచూపే మార్గదర్శకత్వంలోనే కొనసాగుతుంది. క్రియాయోగము మితభోజనముతోను, పూర్తిగా ఏకాంతములోను చేయవలయును.
కనుబొమ్మల మధ్యప్రదేశమును కూటస్థము లేక ఆజ్ఞా + చక్ర మందురు. కూటస్థము ధనధృవము. మూలాధారచక్రము ఋణ ధృవము.  ఈ ఋణధృవము నుండి ధనధృవము వరకు తిరిగి ధనధృవము నుండి ఋణధృవము వరకు ప్రాణశక్తిని త్రిప్పుటవలన మేరుదండము శక్తివంతమైన ఐస్కాంతమగును.  తద్వారా గుదము వద్దయున్న మూలాధారమునుండి కంఠములోని విశుద్ధచక్ర ము వరకు ఉన్న  విద్యుత్తులన్నీకూడా మేరుదండముద్వారా తలలోని బ్రహ్మరంధ్రమును ఆనుకొనియున్న సహస్రారచక్రములోనికి చేర్చ బడి సాధకుడు అనంతమైన ఆనందాన్నిపొందుతాడు. దీనికితోడు కొన్నిముద్రలతోబాటుగా క్రియాయోగముచేయుట వలన మేరుదండ ము మరింతశక్తివంతమగును.
శక్తి మరియు జాగృతి రెండూఉన్నది ప్రాణశక్తి. ప్రాణవాయువులో ఒక్క శక్తిమాత్రమే ఉన్నది. శుష్కంచిపోయేది శరీరము. దహించిపోయేది దేహము. కుళ్ళిపోయేది కళేబరము. క్రియాయోగమువలన శరీరము శుష్కంచదు, దేహము దహించిపోదు, కళేబరము కుళ్ళిపోదు. శరీరము ఆరోగ్యముగా ఉండును.

ధ్యానము వలన సర్వ రోగములు వినాశమగును.
ఆయా చక్రములో చేయు ధ్యానము వలన కలుగు ఉపయోగములు ఈ క్రింద పట్టికలో ఇవ్వబడినవి:
చక్రము
రోగ వినాశము
మూలాధారం
సైనసైటిస్, జలుబు, మలబద్దకము, డయోరియా, లిమ్ఫ్ సిస్టంలు, ప్రోస్ట్రేట్ గ్లాన్డ్స్, ఎముకలు, మనస్సు కి సంబంధించిన రోగముల నివారణ. 
స్వాధిష్ఠాన
యూరినో జెనిటల్ సిస్టంలు, వెన్నెముక, అపెండిక్స్,   నాలుకకి సంబంధించిన రోగముల నివారణ, కోప నిర్మూలన
మణిపుర
చక్కెరవ్యాధి, పక్షవాతము, ప్లీహము, కళ్ళు, ముడ్డి, పొట్ట, నెగటివ్ ఆలోచనల నిర్మూలన, శాంతి మరియు సద్భావన. 
అనాహత
ఉబ్బసము, శ్వాస సంబంధిత రుగ్మతలు, పిచ్చి, వ్యాకులత, హృదయమునకు సంబంధించిన రోగముల నివారణ. రోగనివారణశక్తిని పెంచుట, రక్త శుద్ధీకరణ, ద్వేష మరియు నేరపూరిత భావనివారణ, ప్రేమ ఆప్యాతలను పెంచుట 
విశుద్ధ
ఉబ్బసము,శ్వాస సంబంధిత రుగ్మతలు, అల్లెర్జీ, క్షయ, ఆర్థరైటిస్, కి సంబంధించిన రోగముల నివారణ. ఆత్మహత్యచేసికుందామనే భావ నివారణ
ఆజ్ఞానెగటివ్
పీనల్ గ్లాన్డ్స్, కి సంబంధించిన రోగముల నివారణ. మానసిక బలహీనతను తొలగించుట, సప్త ధాతువులను బలోపేతము చేయుట, మంచి సంతాన ప్రాప్తి.
ఆజ్ఞాపాజిటివ్
తలకాయనొప్పులు, టెన్షన్, కాన్సర్, డిప్రెషన్, ద్వేషము, రోగముల నివారణ. జ్ఞాపకశక్తి పెంపొం దించుట, సెంట్రల్ నర్వస్ సిస్టంను బలోపేతము చేయుట, 
సహస్రార
మొత్తం నర్వస్ సిస్టంను బలోపేతము చేయుట, వీర్య వృద్ధి

అష్టాదశ పురాణములు:
 18 పురాణములలో సృష్టి కార్యక్రమము కథ పునరావృతం అవుతూ ఉంటుంది.
ప్రాచేతసుడి భార్య మరిష.  ప్రాచేతసుడు అనగా శుద్ధ చేతన. మరిష అనగా కోరిక. భౌతిక జగత్తుకి మూలకారణము కోరికలతో కూడిన శుద్ధ చేతన. అప్పుడు వ్యక్తీకరించినవాడినే దక్షుడు అంటారు. క్రమముగా ఆ దక్షుడే ప్రజాపతిగా వ్యవహరించబడ్డాడు.  తత్తదుపరి అనేకమంది ప్రజాపతులు వ్యక్తీకరించబడ్డారు. కనుక మొదటి పురుషుడే దక్ష ప్రజాపతి. మనస్సే బ్రహ్మ.
పరమాత్మ లోనిదే మాయ. మాయకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. విష్ణు, లలితా, కృష్ణ, రామ, బ్రహ్మ, శివ ఇత్యాది దేవీ దేవతలుగా పిలవబడేది మాయ. మా అనగా కాదు, య అనగా యదార్థము. పదార్ధము యదార్థము కానేరదు. మాయ అనగా పరమాత్మ శక్తి తనను తాను సృష్టి స్థితి లయలుగా విభజించుకొని పని నడుపుతూ ఉంటుంది.  సృష్టి అనగా బ్రహ్మ, స్థితి అనగా విష్ణు, శివ లయ అనగా శివ. ఒకే మనిషి భర్తగా, తండ్రిగా, కొడుకుగా, తాతగా, అధికారిగా వివిధములయిన రూపధారణ గావిస్తూ పనులు చేస్తూ ఉంటాడు. ఆ విధముగానే ఒకే పరమాత్మ శక్తి సృష్టి స్థితి లయలుగా విభజించుకొని ఈ జగత్తును  నడుపుతూ త్రిమూర్తులుగా వ్యవహరించబడుతూ ఉంటుంది. అనగా ఈ త్రిమూర్తులు ఒకే శక్తి యొక్క మూడు రూపములు.
  
1) బ్రహ్మ పురాణము: బ్రహ్మ అనగా సృష్టి. సృష్టి  ఎట్లా ఏర్పడినదీ తెలియ పరుస్తుంది ఈ పురాణము.   
2) పద్మ పురాణము: పద్మము నీటిలో ఉన్ననూ కుళ్ళి పోదు. సంసారము నీరులాంటిది. బోటు (boat) నీటిలో ఉండవచ్చు. నీరు బోటులో ఉండకూడదు. అదే విధముగా మనిషి సంసారము అనే నీటిలో ఉన్ననూ, సంసారము అనే నీరు మనిషి అనే బోటులో ఉండకూడదు. అనగా సంసారములో ఉంటూ సంసార తగులము ఉండకూడదు. ఇది తెలియజేసేదే పద్మపురాణము.
    
3) విష్ణుపురాణము: ఏర్పడిన జగత్తు స్థితివంతము ఎట్లా అగునో తెలియజేసేదే విష్ణుపురాణము.
4) శివపురాణము: ఏర్పడిన జగత్తు లయవంతము ఎట్లా అగునో తెలియజేసేదే శివపురాణము.
5) వామనపురాణము: వ అనగా వరిష్ఠమైన, మన అనగా మనస్సుతో ఆది భౌతిక, ఆదిదైవిక మరియు ఆధ్యాత్మిక అడ్డంకులను అధిగమించి అంకిత లేక త్యాగాభావముతో పరమాత్మతో అనుసంథానం పొందు. ఇది తెలియజేసేదే వామనపురాణము.
శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తిని వామనుని అవతారములో వచ్చి మూడు అడుగుల భూమిని దానముగా ఇవ్వమని అడుగుతాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు వారిస్తున్నా వినక  మూడు అడుగుల భూమిని దానము ఇస్తాడు బలిచక్రవర్తి. 
ఇక్కడ వా అనగా వరిష్ఠ అని అర్థము. మన అనగా మనస్సు అని అర్థము. వామన అనగా వరిష్ఠ.  మనస్సు అని అర్థము. అనగా స్థిరమైన మనస్సు అని అర్థము.
స్థిరమైన మనస్సుకి మూడు అడుగులు అవసరము. సాధకునికి మూడు విధములయిన ఆటంకములు వస్తుంటాయి. అవి ఆదిభౌతిక, ఆదిదైవిక మరియు ఆధ్యాత్మిక ఆటంకములు. 
ఆదిభౌతిక ఆటంకములనగా శారీరక రుగ్మతలు,  ఆదిదైవిక ఆటంకములనగా మానసిక రుగ్మతలు మరియు ఆధ్యాత్మిక ఆటంకములనగా ధ్యానపరమయిన రుగ్మతలు. వీటినే మల, ఆవరణ మరియు విక్షేపణ దోషములు అంటారు.
శారీరక రుగ్మతలనగా జ్వరము, తలకాయనొప్పి, ఒళ్ళు నొప్పులు మొదలగునవి.
మానసిక రుగ్మతలనగా మనస్సుకు సంబంధించినవి. అనగా ఆలోచనలు మొదలగునవి.
ధ్యానపరమయిన రుగ్మతలనగా  నిద్ర, తంద్ర, విసుగు, మరియు బద్ధకము మొదలగునవి.
సాధకుడు అనగా ధ్యానయోగి పరమాత్మతో ఐక్యతకు ఈ మూడు రకములయిన విషయములయందు జాగ్రత్త వహించవలయును. అనగా స్థిరమైన మనస్సుకి ఈరకములయిన విషయములను వైరాగ్యముతో అణగద్రొక్క వలయును.  పరమాత్మని ప్రార్థించి  మూడు అడగటములు చేయవలయును. అవే ఈ  మూడు అడుగులు. రాగ్యము అనగా మోహము. ప్రతి వ్యక్తికీ తన సంతానము, ధనము, స్త్రీ, ఇత్యాదిపై రాగ్యము అనగా మోహము ఉంటుంది. వైరాగ్యము అనగా వైవిధ్యమయిన రాగ్యము అనగా మోహము. పరమాత్మ పయిన ఉండే రాగ్యమే ఈ వైరాగ్యము.  
ఏది చేసినా పరమాత్మే. కనుక ఆయనే ఈ మూడు అడుగులు సాధకుడిని అడుగుతాడు. సాధకుడు తీవ్రధ్యానములో ఉన్నప్పుడు ఆంగుష్ఠ ప్రమాణములో కూటస్థములో సూక్ష్మరూపములో వామనుడిగా  తన స్వస్వరూపములో కనబడుటయే దీనికితార్కాణం. 
బలి అనగా తనలోని విషయవాంఛలను  వైరాగ్యముతో అణగ ద్రొక్కుట.
చక్రవర్తి అనగా ఆలోచనా వృత్తులు వర్తులాకారముతో చక్రములాగా వస్తూ ఉంటాయి. బలిచక్రవర్తి అనగా వర్తులాకారములో వస్తున్న ఆలోచనలను వైరాగ్యముతో అణగద్రొక్కుట.
శుక్రాచార్యుడు అనగా అహంకారమును ఆచరించేవాడు. కామ, క్రోధ, లోభ,మోహ,మద మరియు మాత్సర్యములకు కారణభూతమయిన అహంకారమును త్యజించుటే బలి. వీటిని మనలోనే ఉంచుకొని వాటికి అతీతముగా సాధకుడు ఎదగవలయును. మనలోనే ఉంచుకొనటమే పాతాళానికి అణగద్రొక్కుట.  పాతాళము అనగా ఎక్కడోలేదు., మనలోనే ఉన్నది. అతీతము అనగా విషయవాంఛలను వైరాగ్యముతో అధిగమించి వాటికి అతీతముగా సాధకుడు ఎదుగుట.

6)మార్కండేయపురాణము: శ్వాసను అస్త్రముగా ఉపయోగించుటయే శ్వాస్త్రము. అది కాలక్రమేణ శాస్త్రము అయినది. శ్వాసను అస్త్రముగా ఉపయోగించి చిరంజీవిగా ఎలా ఉండవచ్చో తెలియజేసేదే మార్కండేయ పురాణము.
మహా మృత్యుంజయ మంత్రము: దీనిని త్రయంబక మంత్రం అనికూడా పిలుస్తారు. ఇది మృత్యువును జయించు మంత్రం. ఈ మంత్రం శివ లేదా మూడు కన్నుల వాడికి అంకితమయినది. ఇది మార్కండేయ మహర్షి విరచితము.
మనస్సుకకావికలమయినప్పుడు, కాలసర్పదోషమును నివారించుటకు, భయంకరమయిన రోగముల నివారణకు  ఈ మంత్రం తప్పక పఠించ వలయును.
 ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉరు వారుకమివ బంధనాత్ మృత్యోర్ముఖ్ క్షీయమామృతాత్ ।।
తాత్పర్యము: ఓం = పరమాత్మ,  త్రయంబకం = మూడుకన్నులవాడిని, యజామహే = ప్రార్థిస్తున్నాను.సుగంధిం = సువాసన గల,  పుష్టివర్ధనం =ఐశ్వర్యయుక్త మయిన దృఢమయిన, ఉరువారుకమివ = పెద్దది  శక్తిగల,  బంధనాత్ = మాయ అనే బంధమునుండి,  మృత్యోర్ముఖ్ క్షీయ = మృత్యువునుండి,   మా = నన్ను,  మృతాత్= అమృతత్వమునకు తీసికెళ్ళుగాక.
పరమాత్మ మూడుకన్నులవాడిని ప్రార్థిస్తున్నాను. సువాసన గల  ఐశ్వర్యయుక్త మయిన దృఢమయిన పెద్దది  శక్తిగల  మాయ అనే బంధముఅనే  మృత్యువునుండి  నన్ను అమృతత్వమునకు తీసికెళ్ళుగాక.  ఈ మంత్రమును 108 సార్లు కూటస్థములో మనస్సు దృష్టి పెట్టి చేయవలయును. తద్వారా నకారాత్మక శక్తులను అరికట్టవచ్చు.
7) వరాహ పురాణము: భక్తి, క్రమశిక్షణలు అనే దంత ద్వయంతో,  వ అనగా వరిష్ఠ మైన,  రాహ అనగా దారి, వరిష్ఠమైన దారిలో నడుస్తూ నీ కర్తవ్యమును నిర్వహించు. వ  వరిష్ఠమైన రాహ  మార్గము, వరాహమనగా  గొప్ప మార్గము. క్రియాయోగసాధనా మార్గము. అని ఉద్భోదించటమే హిరణ్యాక్ష వధ.
వరాహ అవతారములో పృథ్వీని పరమాత్మ రెండు దంతములతో పైకెత్తును. పృథ్వీకి ప్రతీక మనిషి. సంసారము నీటికి ప్రతీక.  మనిషికి రెండుజ్ఞానదంతములుండును. రెండుదంతములు జ్ఞానమునకు ప్రతీకలు. మనిషి పెద్దవాడయ్యేసరికి రెండుజ్ఞానదంతములు వచ్చును.  ఓ మనిషీ, సంసారమనే నీటిలో మునిగిపోకు. క్రియాయోగాసాధనతో సాధించిన  జ్ఞానముతో సంసారమునుండి బయటపడు. పరమాత్మతో అనుసంధానం పొందు అని తెలియజెప్పుటకు ఉద్దేశించినది వరాహావతారము. వరాహ/నరసింహా వతారములలో స్థూలశరీరమునకు సంబంధించిన  బ్రహ్మగ్రంది విచ్ఛేదము జరుగుతుంది. ఇది తెలియజేసేదే వరాహ పురాణము.
  
8) అగ్నిపురాణము: కర్మలను ఎట్లు దగ్ధము చేసికొనవచ్చునో తెలియజేసేదే అగ్నిపురాణము. ఆచారములు, దగ్ధ యోగములు, సూక్ష్మ నాడీ వివరణలు తెలియజేసేదే అగ్ని పురాణము.
9) కూర్మ పురాణము: కూర్మము అనగా తాబేలు. శతృవులనుండి తనను రక్షించుకోవటము కొఱకు తాబేలు తన అవయములను లోపలి ముడుచుకొనును. దినమునకు తాబేలు అతి తక్కువ శ్వాసక్రియచేయును. అందువలన ఎవ్వరూ హాని చేయనియడల కూర్మము దీర్ఘకాలము జీవించగలదు. అదేవిధముగా సాధకుడు తన ఇంద్రియ వ్యాపారములను క్రియాయోగము ద్వారా ఉపసంహరించుకొనవలయును. ప్రాణశక్తి నియంత్రణా ప్రావీణ్యము సంపాదించ వలయును. ఇది తెలియజేసేదే కూర్మ పురాణము.
    
10) భగవత్ మహాపురాణము: భగవత్ మహాపురాణమునకు మరొక పేరే శ్రీమద్భాగవతము. భ అనగా భక్తి, గ అనగా జ్ఞానము, వ అనగా వైరాగ్యము, త అనగా తత్ అనగా అది త్వమ్ నీవే అసి అనగా అయి ఉన్నావు. శ్రీ అనగా పవిత్రమయిన మత్ అనగా మనస్సు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, అది నీవే  అయి ఉన్నావు అనేదే పవిత్రమయిన మనస్సు. ఇది తెలియజేసేదే భగవత్ మహాపురాణము లేదా శ్రీమద్భాగవతము.
11) లింగపురాణము: లింగ అనగా సూక్ష్మము అని అర్ధము.  మహా ప్రళయానంతరము సృష్టి సూక్ష్మరూపములో పరమాత్మలో నిక్షిప్తమై యుండును. తిరిగి సృష్టి ప్రారంభము అయినప్పుడు ఏ విధముగా స్థూల రూపము దాల్చునో తెలియజేసేదే లింగ పురాణము.
12) నారదపురాణము: నా లేని రద శరీరము అనగా ఆత్మ అని అర్ధము. సాధకునికి కలిగే ఆత్మ బోధయే నారదపురాణము.
ఈ సృష్టి యావత్తు పరమాత్మ అనగా సృష్టికి అతీతమైన సత్తు వలననే కలిగినది. సత్తునుండే సృష్టిలోని పరమాత్మ అనగా పరమాత్మ యొక్క సర్వశక్తిమంతమైన శుద్ధచైతన్యము కూటస్థచైతన్యముగానూ, మహాప్రకృతిగానూ, దానియొక్క ఆరువిధములైన  సమిష్టి కారణ, వ్యష్టి కారణ, సమిష్టిసూక్ష్మ, వ్యష్టి సూక్ష్మ, సమిష్టిస్థూల, వ్యష్టి స్థూల, చైతన్యములు ఆవిర్భవించినవి.
మహాప్రకృతి మరియు ఆరు చైతన్యములు కలిసి సప్తమహర్షులు అనగా మరీచి, అత్రి, అంగీరస, పులహ, క్రతు, పులస్త్య, మరియు వశిష్టులుగా పిలవబడుచున్నారు.   
సనక, సనందన, సనాతన మరియు సనత్కుమారులు సృష్టికర్తయైన బ్రహ్మయొక్క ఆది మానసపుత్రులుగా ఆవిర్భవించారు. వారినుండి మిగిలిన జీవసృష్టి ఆవిర్భవించినది. వీరిని పరమాత్మయొక్క  శుద్ధ నిర్మాణాత్మక మహాప్రకృతిగా చెప్పవచ్చు. 
సనక అనగా మొట్టమొదటి అని అర్థము. సానంద అనగా సంతోషముతోకూడిన అని అర్థము. సనాతన అనగా నిత్యమైన అని అర్థము.  సనత్కుమార అనగా నిత్యయౌవనము అని అర్థము. కాని ఈ బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందనాదులు శుద్ధముగా, అమాయకముగా, ఉండిపోయి సంతానోత్పత్తికి ఇష్టపడలేదు.
కాని నిత్యసంతోషియైన పరమాత్మ మరియు మహాప్రకృతిలోని అంతర్గతమైన ఆనందము కలిసి సత్వ, రజో మరియు తమో గుణములకు దారితీసినవి. ఈ మూడుగుణములు మహాప్రకృతిలో కదలకుండా యున్న చెరువులోని నీరులాగా శాంతముగా ఉన్నవి.
కాని కదిలే లేక కదిలించే గుణముగల రజోగుణముయొక్క స్పందనలు మిగిలిన స్థితివంతమైన సత్వగుణమును, లయ లేదా నాశనము చేసే తమోగుణమును గూడా కదిలించేటట్లు చేసినది. తన స్పందనలతో రజోగుణము సృష్టికి కారణమయినది గాన దీనిని బ్రహ్మ అంటారు. స్థితివంతమైన సత్వగుణమును విష్ణువంటారు. లయ కారణమయినది గాన తమోగుణమును శివుడంటారు.
మహాప్రకృతిలోని అనేక రూపములలో అనుభూతి చెందటము అనే ఇచ్ఛ అంతర్గత ఆనందమును ఈ మూడుగుణములమీద నాలుగు ప్రధానమైన నిర్మాణాత్మక భావనలను (Ideas)రుద్దుతుంది.      అవి: స్పందన(ఓం)(vibration), కాలము(Time), దేశము(Space), మరియు అణు(the idea of division of one into many)అనగా ఒకే పరమాత్మను అనేక రూపములగావిభజించుట).
స్వయంభువ, స్వారోచిష, ఔత్తమి, తమస, రైవత, చక్షుష, వైవస్వత, సావర్ణి,దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్య లేక దేవసావర్ణి,  భౌత్య లేక ఇంద్రసావర్ణి, అని  మనువులు పధ్నాలుగురు.  ప్రతిమనువు ఒక్కొక్క మన్వంతరమునకు ఆది పురుషుడు. ఒక మన్వంతరము పూర్తి అయిన తదుపరి ప్రళయము సంభవించి తత్తదుపరి మన్వంతరమునకు నాందిపలుకుతుంది.   
ప్రస్తుతము వైవస్వత మన్వంతరము జరుగుచున్నది. వైవస్వత అనగా  పరమాత్మ ప్రకాశము. మనువు అనగా మనస్సు. ఈ మనస్సు ద్వారానే చేతన గల మనిషి అవతరించేది. 
13) స్కందపురాణము: సర్వసిద్ధులను సమకూర్చొడి మహేశ్వర ధర్మములు కుమార స్వామిచే లోకానుగ్రహ బుద్ధితో చెప్పబడిన పురాణము ఇది. స్వామి అనగా తనను తాను తెలిసికునే కుమార అనగా శక్తి.  మహా అనగా అత్యంత తేజవంతము అయిన, ఈశ్వర అనగా ఈక్షణములను శ్వరములుగా గలవాడు.  తీవ్ర క్రియాయోగ సాధకుని ఈక్షణములు అనగా చూపులు అత్యంత తేజవంతము అయిన శ్వరములు అనగా బాణములు గా ఉండును.  అవి సర్వసిద్ధులను మరియు తనను తాను తెలిసికునే  శక్తిని సమకూర్చును.
మనలోని లోకములను వ్యష్టి అని, బ్రహ్మాండములోనివి సమిష్ఠిలోకములు అని అంటారు. వ్యష్టి లోనిది పాతాళ (మూలాధారచక్రము)  లోకము  సమిష్ఠిలోనిది భూలోకము.
వ్యష్టి లోనిది మహాతల (స్వాధిష్ఠానచక్రము)  లోకము  సమిష్ఠిలోనిది  భువర్ లోకము.
వ్యష్టి లోనిది తలాతల (మణిపురచక్రము)  లోకము  సమిష్ఠిలోనిది స్వర లోకము.
వ్యష్టి లోనిది రసాతల (అనాహతచక్రము)  లోకము  సమిష్ఠిలోనిది మహర్ లోకము.
వ్యష్టి లోనిది సుతల (విశుద్ధచక్రము)  లోకము  సమిష్ఠిలోనిది జనలోకము.
వ్యష్టి లోనిది వితల (ఆజ్ఞాచక్రము)  లోకము  సమిష్ఠిలోనిది తపోలోకము.
వ్యష్టి లోనిది అతల (సహస్రారచక్రము)  లోకము  సమిష్ఠిలోనిది సత్య లోకము.
క్రియయోగాసాధన ద్వారా ఈ వ్యష్టి లోని ఏడు మరియు  బ్రహ్మాండము లోని ఏడు సమిష్ఠిలోకములు  మొత్తము పదునాలుగు లోకములూ అనుగ్రహించబడును. ఇది తెలియజేసేదే స్కందపురాణము.
14. గరుడపురాణము: గ శబ్దము జ్ఞానమునకు ప్రతీక. అందుకనే గం గణపతయేనమః అంటారు. గ అనగా జ్ఞాన,  రుడ అనగా రూఢుడు  అనగా జ్ఞానారూఢుడు అవ్వాలని తెలియజేసేదే గరుడపురాణము. క్రియాయోగ ధ్యానము చేసి ఆ జ్ఞానప్రాప్తి పొందుట ఎట్లానో తెలియజేసేదే గరుడపురాణము.
15. మత్స్యపురాణము: మత్స్యము అనగా చేప. సంసారము అనేది నీరులాంటిది. మత్స్యము నీటిలో ఉన్ననూ కుళ్ళిపోదు. అదేవిధముగా సంసారములో ఉన్ననూ వ్యక్తికి సంసారతగులము ఉండకూడదు.
ఒక కాష్ఠ = 15 రెప్పపాటుల కాలము.
30 కాష్ఠలు = కల
30 కలలు = ముహూర్తము = 2 గడియలు =6 విఘడియలు  
30 ముహూర్తములు = 24 గంటలు.
16. వాయు పురాణము: అష్టాంగ యోగము ద్వారా ప్రాణశక్తి నియంత్రణ చేయుట, క్రియాయోగ ధ్యాన సాధన ద్వారా పరమాత్మతో మమైకము అగుటయే మానవజన్మ యొక్క సార్ధకత అని తెలియజేసేదే వాయు పురాణము.
12 మాత్ర (చిటికవేయునంత కాలము)ల కాలము పూరకము, 12 మాత్రల కాలము కుంభకము మరియు 12 మాత్రల కాలము రేచకము   చేయు ప్రాణాయామము మందము అంటారు.
12 మాత్ర (చిటికవేయునంత కాలము)ల కాలము పూరకము, 12 మాత్రల కాలము కుంభకము మరియు 12 మాత్రల కాలము రేచకము   చేయు ప్రాణాయామము మందము అంటారు.
21 మాత్రల కాలము పూరకము, 21 మాత్రల కాలము కుంభకము మరియు 21మాత్రల కాలము రేచకము, చేయు ప్రాణాయామము మధ్యమము అంటారు.
36 మాత్రల కాలము పూరకము, 36 మాత్రల కాలము కుంభకము మరియు 36 మాత్రల కాలము రేచకము, చేయు ప్రాణాయామము ఉత్తమము అంటారు.
ఈ పై విధముగా ప్రాణాయామ ప్రక్రియలను అని తెలియజేసేదే వాయు పురాణము.
17.  భవిష్య పురాణము: క్రియాయోగ సాధన చేయని వ్యక్తి ప్రవృత్తి, లక్షణములు, స్వభావములు, ఎట్లా ఉండునో తెలియజేసేదే భవిష్య పురాణము.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర కులములు అనేవి వారి వారి గుణములను బట్టి ఏర్పడినవి.
ఇంద్రియవిషయవాంఛలోలుడు, కాయకష్టము చేసేవాడు లేక కేవలము స్థూలశరీరము పైన ఆధారపడేవాడు శూద్రుడు, జ్ఞానసముపార్జనకై పాటుబడుతూ తన అజ్ఞానమును తొలగించుకొని ఆధ్యాత్మికతవైపు మనస్సును మళ్ళించుకొనేవాడు వైశ్యుడు, అంతఃశత్రువులను అరికట్టి, ఆత్మనిగ్రహశక్తిని పెంపొందించు కొని  ధ్యానము వైపు తీవ్రముగా ప్రయత్నము చేసేవాడు క్షత్రియుడు, ధ్యానముద్వారా పరమాత్మతో అనుసంధానము పొందేవాడు బ్రాహ్మణుడు.
ప్రతి వ్యక్తిలోనూ నకారాత్మక మరియు సకారాత్మక శక్తులు రెండూ ఉంటాయి. యోగాభ్యాసములు మరియు క్రియాయోగ ధ్యానముద్వారా తనలోని నకారాత్మక ప్రకృతిని ప్రవృత్తిని తొలగించుకొని సకారాత్మక ప్రకృతిని ప్రవృత్తిని వృద్ధి చేసికొని క్రమముగా ‘అహం బ్రహ్మాస్మి’ అనగా మానవుడు స్వయముగా తనలోని దైవత్వమును పెంపొందిచుకొని, తను కేవలము పరమాత్మచైతన్య స్వరూపుడని అర్ధము చేసికోనవలయును.  లేనియడల భవిష్యత్ లో తనలోని నకారాత్మక శక్తులు విజృంభించి మానవుడు దానవుడుగా మారతాడు. అకారణముగానే దేశ విధ్వంసమునకు పాల్పడుతాడు.  దేవాలయములను పవిత్ర స్థలములను నాశనము చేస్తాడు. అమాయకులను అతి దారుణముగా  ఊచకోతకోస్తాడు.     
18.బ్రహ్మాండపురాణము: సృష్టి కార్యక్రమము, ప్రపంచము వసతి కార్యములు అనగా మానవాళి నివసించుటకు వాస్తు ఇత్యాది వ్యవహారము లన్నియు ఈ బ్రహ్మాండపురాణము తెలియజేస్తుంది. మనిషికి గాలి వెలుతురు మరియు నీరు వసతులగురించి తెలియజెప్పేదే బ్రహ్మాండపురాణము.  
19. బ్రహ్మవైవర్త పురాణము: సృష్టి కార్యక్రమము జరిగిన తదుపరి ఆ సృష్టి ఎట్లా వ్యాప్తి చెందినదో తెలియజేస్తుందిబ్రహ్మవైవర్త పురాణము.
సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఇంకొక నక్షత్రమును కేంద్రముగా తీసికొని దాని చుట్టూ కోడిగుడ్డు లాంటి(Elliptical order) కక్ష్యలో తిరుగుతూ ఉంటాడు.
ఈకేంద్రమును విష్ణునాభి అంటారు. ఆ నాభిమీద బ్రహ్మని పద్మములో కూర్చున్నట్లుగా చూపిస్తారు. బ్రహ్మ అనగా జ్ఞానానికి కేంద్రము.  పద్మము నీరులో ఉన్నా కుళ్ళిపోదు. అలాగే మనిషి నీరు అనే సంసారములో ఉన్నా కుళ్ళి పోకూడదు. పరమాత్మను మర్చిపోయి ధ్యానము మానకూడదు. అదే జ్ఞానమంటే.
సూర్యుడు విష్ణునాభి చుట్టూ తిరుగుటకు 24000 సంవత్సరముల సమయము పడుతుంది.  12000 సంవత్సరములు అర్థ వృత్తము. 
పైకి వెళ్ళే అర్థవృత్తము ఆరోహణ(Ascending) అర్థవృత్తము. క్రిందకు తిరిగి వచ్చు వృత్తము అవరోహణ(descending) అర్థవృత్తము.  
మార్చి నెల 21వ తేదీన మేష సంక్రాంతి(Vernal Equinox) వస్తుంది. సెప్టెంబర్ 23వ తేదీన తులా(Autumnal Equinox) సంక్రాంతి వస్తుంది. రాత్రీపగలు సమముగా ఉంటాయి.
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించుటవలన మకర సంక్రాంతి వస్తుంది. దీనినే ఉత్తరాయణం(Summer Solstice) అంటారు. సూర్యుడు (జూన్ నెల 21వ తేదీ ప్రాంతములో) భూమధ్యరేఖకి  (Equator) 23 ½   ఉత్తరదిశగా ఎత్తులో లేక దూరముగా  ప్రయాణిస్తాడు. అందువలన చలి మొదలగుతుంది.
సూర్యుడు కర్కాటకరాశిలో ప్రవేశించుటవలన కర్కాటక సంక్రాంతి వస్తుంది. దీనినే దక్షిణాయణం(Winter Solstice)  అంటారు. సూర్యుడు (డిసెంబరు నెల 21వ తేదీ ప్రాంతములో) భూమధ్యరేఖకి  (Equator) 23½   దక్షిణదిశగా దగ్గిరలో ప్రయాణిస్తాడు.. అందువలన వేడి మొదలగుతుంది.
24000 సంవత్సరముల సూర్యుని విష్ణునాభి పరిభ్రమణములో మొదటి 12000 సంవత్సరముల ఆరోహణ(Ascending) అర్థ వృత్తములో కలి, ద్వాపర, త్రేతా మరియు కృత లేక సత్య అనే నాలుగు యుగములు,  తరువాతి 12000 సంవత్సరముల అవరోహణ (Descending) అర్థ వృత్తములో అదే విధమయిన నాలుగు యుగములు కలిగియుండును. 
ప్రతి యుగమునకు 1000 సంవత్సరములకు యుగ ప్రారంభములో  100 సంవత్సరములు, యుగ అంతములో 100 సంవత్సరములు మొత్తము  200 సంవత్సరముల సంధికాలము ఉంటుంది.  అలా
కలియుగము= 100+1000+100=1200 సంవత్సరములు,
ద్వాపరయుగము =200+2000+200=2400 సంవత్సరములు, 
త్రేతాయుగము= 300+3000+300=3600 సంవత్సరములు,
కృతయుగము=400+4000+400=4800 సంవత్సరములు,.
మొత్తము                          = 12000 సంవత్సరములు

క్రీ.శ. 1700 సంవత్సరమునుండి ఆరోహణ(Ascending) ద్వాపర యుగము  ప్రారంభమయినది. అనగా ప్రారంభములోని 200 సంవత్సరముల సంధికాలము కూడా గడిచిపోయినది. 2016వ సంవత్సరమునకు 116 సంవత్సరముల అసలయిన ఆరోహణ ద్వాపరయుగము కూడా  గడిచి పోయినది.  4100 సంవత్సరములో ఆరోహణ  త్రేతా యుగము ప్రారంభమవుతుంది. 
రాజా పరీక్షిత్ సమయములో అవరోహణ (descending) కలియుగము అప్పటికే ప్రారంభము అయినది. పాండవులు మరియు విజ్ఞులు కలిసి హిమాలయములకు వెళ్ళిపోయారు. తెలియజెప్పే విజ్ఞులు లేకపోవడంతో మరియు అవగాహనా రాహిత్యముతో  ఇట్లా కలియుగము ప్రారంభము అయినది అని చెప్పటానికి  ఎవరూ సాహసించలేదు. 2400 సంవత్సరముల అవరోహణ ద్వాపరయుగము పూర్తి అయినప్పటికీ దానినే పొడిగించి 2401 సంవత్సరముల అవరోహణ ద్వాపరయుగముగా చెప్పారు.
మేష సంక్రాంతి(Vernal Equinox) (స్థిర నక్షత్రము రేవతినుండి) మేష మొదటి పాదమునుండి 200 54’  36’’ దూరములో ఉన్నది అని, అది గడిచిపోయి 1394 సంవత్సరముల అయినదని, ప్రస్తుతము   ఆరోహణ ద్వాపరయుగములో 194వ సంవత్సరము జరుగుతున్న దని స్వామి శ్రీయుక్తేస్వర్ క్రీ.శ.1894లో లెక్కకట్టి చెప్పారు. కనుక  ప్రారంభ సంధికాలము 200సంవత్సరములు పోను 2016వ సంవత్స రానికి 116వ నిజ ఆరోహణ ద్వాపరయుగము జరుగుతున్నది.
ప్రతియుగమునకు దాని సంబంధిత యుగ ధర్మము ఉంటుంది. ఆ ధర్మములు ఈ క్రింద ఇవ్వడమయినది.    
యుగ ధర్మములు:
కలియుగము:
సూర్యుడు విష్ణునాభి చుట్టూ తిరుగు 12000 సంవత్సరముల ఆరోహణ(Ascending) అర్థవృత్తములోని మొదటి 1200 సంవత్సరములు కలియుగము. ఆ సమయములో ధర్మము ఒక పాదము మీదనే ఉంటుంది. కానీ ఆరోహణ(Ascending)లో క్రమముగా పెరుగుతూ ఉంటుంది. బుద్ధి  భౌతికమైన విషయములకు ప్రాధాన్యతనిస్తున్ననూ పరమాత్మకి చేరువగా జరుగుతూ ఉంటాడు. అదే అవరోహణ (descending) కలియుగములో కేవలము భౌతికమైన విషయములకే అనగా స్థూల శరీరమునకు ప్రాధాన్యత నిస్తాడు మనిషి. పరమాత్మకి దూరముగా జరుగుతూ ఉంటాడు.    
ద్వాపరయుగము:
సూర్యుడు విష్ణునాభి చుట్టూ తిరుగు 12000 సంవత్సరముల ఆరోహణ(Ascending) అర్థవృత్తములోని 1200 సంవత్సరముల కలియుగ సమాప్తము అయిన తదుపరి కాలము 2400 సంవత్సరముల ద్వాపరయుగ కాలము. ఆ సమయములో ధర్మము రెండు పాదముల మీద ఉంటుంది. ఆరోహణ(Ascending)లో క్రమముగా పెరుగుతూ ఉంటుంది. బుద్ధి  ఆలోచనాపరమైన విషయములకు ప్రాధాన్యతనిస్తూ పరమాత్మకి కొంచెంకొంచెంగా చేరువుగా అవుతూ ఉంటుంది. సూక్ష్మ శరీరమునకు అనగా మనసుకు ప్రాధాన్యత నిస్తాడు మనిషి.  క్రీ.శ. 1700 సంవత్సరమునుండి అర్థవృత్తములోని 2400 సంవత్సరముల ఆరోహణ ద్వాపరయుగ కాలము ప్రారంభమయినది.  అందువలననే 1700 సంవత్సరమునుండి అనేకమయిన శాస్త్రీయ పరిశోధనలు (Scientific inventions) చేసి ఉత్తీర్ణుడవుతున్నాడు మనిషి.   అదే అవరోహణ (descending) ద్వాపరయుగములో బుద్ధి  ఆలోచనాపరమైన విషయములకు కొంచెంకొంచెంగా దూరముగా అవుతూ ఉంటుంది.
త్రేతాయుగము:
సూర్యుడు విష్ణునాభి చుట్టూ తిరుగు 12000 సంవత్సరముల ఆరోహణ(Ascending) అర్థవృత్తములోని 2400 సంవత్సరముల ద్వాపరయుగ సమాప్తము అయిన తదుపరి కాలము 3600 సంవత్సరముల త్రేతాయుగ కాలము. ఆసమయములో ధర్మము మూడు పాదముల మీద ఉంటుంది. ఆరోహణ(Ascending)లో క్రమముగా పెరుగుతూ ఉంటుంది. బుద్ధి కారణ శరీరవిషయములకు ప్రాధాన్యతనిస్తూ పరమాత్మకి చాలా చేరువుగా ఉంటుంది. అదే అవరోహణ (descending) త్రేతాయుగములో పరమాత్మకి కొంచెం దూరమవుతుంది.  
కృతయుగము:
సూర్యుడు విష్ణునాభి చుట్టూ తిరుగు 12000 సంవత్సరముల ఆరోహణ(Ascending) అర్థవృత్తములోని 3600 సంవత్సరముల త్రేతాయుగ సమాప్తము అయిన తదుపరి కాలము 4800 సంవత్సరముల కృతయుగ కాలము. ఆ సమయములో ధర్మము నాలుగుపాదముల  మీద  ఉంటుంది. ఆరోహణ(Ascending)లో బుద్ధి  పరమాత్మకి చేరువగుతుంది. అదే అవరోహణ (descending) కృతయుగములో పరమాత్మకి దూరమవుట అనే ఆరంభమునకు నాంది పలుకుతుంది.
తప్పును సర్దిచెప్పుకొనుట
అవరోహణ (descending) ద్వాపరయుగములో బుద్ధి  ఆలోచనాపరమైన విషయములకు కొంచెంకొంచెంగా దూరముగా అవుతూ ఉంటుంది. ప్రాచీనఋషులు సరిగ్గా చెప్పిన 1200 సంవత్సరముల కలియుగమును అవగాహనారాహిత్యముతో 4,32,000 వేల సంవత్సరములుగా నిర్ణయించిన విజ్ఞతను తప్పుగా తెలిసికున్న పెద్దలు దానిని ధైర్యముగా సరిదిద్దుటకు బదులుగా ఆ తప్పునే సమర్థిస్తూ 1200 సంవత్సరములను దైవ  సంవత్సరము గానూ, ఒక దైవ సంవత్సరము=360 సూర్యదినములుగా (Solar days) అభివర్ణించారు.
ఆవిధముగా 1200x360=4,32,000దైవ సంవత్సరములు అయినవి.
ద్వాపర, త్రేతా మరియు కృత యుగములకు కూడా ఈ గుణకారము (Calculation)సరిగ్గా సరిపోయినది.

ఆరోహణా క్రమములో బ్రహ్మాండము క్రమముగా వృద్ధి చెందుతూ ఉంటుంది. పరమాత్మచేతన వైపుకు ఆకర్షించబడుతూ ఉంటుంది. ఆ క్రమములో ప్రాణుల చేతన   మానవచేతనగా రూపాంతరము చెందుతూ ఉంటుంది. ఒక్క మానవచేతన ద్వారా మాత్రమె పరమాత్మచేతనలో మమైకమగుటకు అవకాశము ఏర్పడుతుంది.
ఆరోహణ కలియుగము 500 A.D. – 1700 A.D సమాప్తమయినది.
ప్రస్తుతము జరుగుతున్నది  ఆరోహణ ద్వాపరయుగము. దీని సమయము 1700 A.D.—4100A.D.
మానవ జనాభా  ఆరోహణ కలియుగాంతముకంటే అనగా 1700 A.D లో ఉన్న దానికంటే   ఆరోహణ ద్వాపరయుగములో అనగా  1700 A.D.—4100A.D లో ద్విగుణీక్రుతమగుతుంది. 
ఆరోహణ ద్వాపరయుగాంతముకంటే అనగా  1700 A.D.—4100A.D లో ఉన్న దానికంటే త్రేతాయుగములో అనగా  4100 A.D.—7700A.D. లో జనాభా ద్విగుణీక్రుతమగుతుంది. 
అదేవిధముగా ఆరోహణ త్రేతాయుగాంతము అనగా  4100 A.D.—7700A.D. లో కంటే ఆరోహణ కృతయుగములో అనగా 7700—12500A.D. లో జనాభా ద్విగుణీ క్రుతమగుతుంది. అప్పటికి 500 A.D.నుండి12500A.D. వరకు 12000 సంవత్సరముల సూర్యుడు విష్ణునాభి చుట్టూ తిరగవలసిన  ఆరోహణ అర్థ వృత్తము సమాప్తమగుతుంది. అవరోహణ అర్థ వృత్తము ప్రారంభమగుతుంది.
అవరోహణ యుగములలో అదే క్రమములో జనాభా తగ్గుతూ వస్తుంది.

అవరోహణ కలియుగము 1200 B.D. – 500 A.D. లో  సమాప్తమయినది. ఈ సమయములో జనాభా తక్కువగా ఉన్నది. వారు ఏ కుటుంబ నియంత్రణ పద్ధతులూ పాటించలేదు. ఆ సమయములో భయంకరమయిన బాక్టీరియా మరియు వ్యాధులు లేకపోయిననూ, జనాభా అంతగా పెరగలేదు. వారి ఆయు పరిమితికూడా అధికపక్షము 40-50 సంవత్సరములకు మించి ఉండెడిది కాదు.  దానికి కారణము యుగ ధర్మము.
500 A.D నుండి ఆరోహణక్రమము ప్రారంభము అయినది.  500 A.D. – 1700 A.D ఆరోహణ కలియుగ కాలము. వారి ఆయు పరిమితికూడా 50-60 సవత్సరములకు పెరిగినది. తగ్గుతూ వస్తున్న జనాభా తిరిగి పెరుగుతూ వస్తున్నది. పెద్ద పెద్ద జంతువులూ  తిమింగలములు  ఆఖరికి క్రూరమృగములు ఇత్యాదివి అదృశ్యమగుటకు కారణము చైతన్యము వృద్ధిచెంది మానవజాతిగా పరిణమించి పరమాత్మవైపు పరిగిడుటయే.   ఆయు పరిమితికూడా 60-70 +  సంవత్సరములకు పెరిగినది.
మానవజాతి మాత్రమె ఎక్కువకాలము జీవించగలదు.  కదలికగల అనగా గమనశక్తిగల  జీవుల భౌతిక కాలపరిమితి మానవ జీవిత కాలపరిమితికంటే తక్కువ సమయము ఉండుటకు కారణమిదియే.  మానవజన్మ, ముముక్షత్వము, మహాపురుష దర్శనము దుర్లభము. ఒక్క మానవుడు మాత్రమె తన చేతనను క్రియాయోగ సాధన ద్వారా వృద్ధిచేసికొని పరమాత్మచేతనలో మమైకమవ్వగలడు. ఆ సాధనకై  ఎక్కువకాలము జీవించుటకూడా అవసరము.  క్రియాయోగసాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా ఆరోగ్యకరమైన దీర్ఘ మయిన ఆయుష్షుతోకూడిన జీవనము లభిస్తుంది.
   

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana