కిష్కింధా కాండ రామాయణము

                                                                    కిష్కింధా కాండ

కమలములతో కలువలతో మత్స్యములతో నిండియున్న ఆ పంపా సరోవరము వద్దకు రాగానే సీతాదేవి జ్ఞాపకము వలన వ్యాకులతచెందెను. అప్పుడు శ్రీరాముడు ఈ విధముగా లక్ష్మణుడునితో విలపింపసాగెను.

ఆహో కామస్య వామత్వం వామత్వం యో గతామపి దుర్లభాం

స్మారయిష్యతి కల్యాణీం కల్యాణతర వాదినీం                                         1

ఆహా, కామము యెంత కుటిలమైనది. ఇతరత్రా వెళ్ళినటువంటిదుయు, పరమ దుర్లభమైనది. కళ్యాణమయములగు వాక్యములను పలుకునది. కళ్యాణ స్వరూపిణియు అగు సీతమ్మను మాటిమాటికి స్మరింపచేయుచున్నది.

ఈ ప్రకారముగా మహాత్ముడగు శ్రీరాముడు అనాథునివలె విలపించుచుండెను.అది చూచి లక్ష్మణుడు యుక్తి యుక్తమైనటువంటిదియు సిర్దోషమైనదియు అగు వాక్కుతో ఇట్లు పలికెను.

సంస్తంభ రామ భద్రం తే మాశుచః పురుషోత్తమః

నే దృశానాం మతిర్మందా భవిత్యకలు షాత్మనాం                         2

పురుషోత్తముడవగు శ్రీరామా, మీకు క్షేమమగుగాక.  మిమ్మలిని మీరు కుదుటపరచు కొనుడు. దుఃఖింపవలదు. మీవంటి పుణ్యాత్ముల బుద్ధి ఉత్సాహరహితము కానేరదు.

స్వాస్థ్యం భద్రం భజస్వార్య త్యజతాం కృపణామతిః

అర్థొహి నష్టకార్యార్థై యత్నేనాధి గమ్యతే                                   3

ఆర్యా, శుభప్రదమగు ధైర్యమును అవలంభించుడు. ఎవరియొక్క ప్రయత్నము శక్తి  నశించిపోయినవో, అట్టివారు ఉత్సాహపూర్వకమగు ప్రయత్నమూ చేయనిచో అట్టివారికి అభీష్టమగు పదార్థము ప్రాప్తించదు.

ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహాత్ పరం బలమ్

సోత్సాహస్య హి లోకేషు న కించిదపి దుర్లభం                      4    

అగ్రజా, ఉత్శాహమే బలము. ఉత్సాహమునకు మించిన బలము వేరొకటి లేదు. ఉత్సాహవంతునకు ప్రపంచమున అసాధ్యమనేది లేదు.

త్యజతాం కామవృత్తత్వం శోకం సంస్యస్య పృష్ఠతః

మహాత్మానం  కృతాత్మానం ఆత్మానం నావ బుధ్యసే                     5

శోకమును వెనక్కు నేట్టివేయుడు.  కామియొక్క వ్యవహారమును వదలివేయుడు. మీరు మహాత్ములు. పవిత్ర హృదయములు. కాని ప్రస్తుతం మెమ్మల్ని మీరు మర్చిపోయిరి.  మీ స్వరూపముయొక్క స్మరణను గావించుటలేదు.  

లక్ష్మణుడు ఇట్లుచెప్పినంతనే, శ్రీరాముడు శోకము మోహము వదిలివేసెను. ఋష్యమూక పర్వతమున బలవంతుడైన వానరరాజు సుగ్రీవుడు. పంపాసరోవారము చెంత విహరించు చుండెను. అద్భుత రూపులును, దర్శనీయులైన వీరులగు శ్రీరామచంద్ర లక్ష్మణులను చూచెను. వీరిని నా శత్రువగు వాలి పంపిఉండవచ్చునని భయపడిన సుగ్రీవుని చూచి హనుమంతుడిట్లు పలికెను.

బుద్ధి విజ్ఞాన సంపన్న ఇఙ్గితైః సర్వమాచారః

నహ్య బుద్ధింగతో రాజా సర్వభూతాని శాంతిహి                                   6

బుద్ధి విజ్ఞానములతో తో కూడి మీరు ఇతర చేష్టలద్వారా వారి మనోభావాలను తెలిసికొనవలయును. మరియు దానిననుసరించి కార్యములను చేయవలయును.  రాజు బుద్ధిబలమును ఆశ్రయించి పనులు చేయవలయును. బుద్ధిబలమును ఆశ్రయించని రాజు ప్రజలపై శాశనము చేయజాలడు.  

హనుమంతుడు చెప్పిన ఈ శ్రేష్ఠమైనవాక్యములను విని సుగ్రేవుడు ఈ విధమైన మహోత్తర వాక్యములన్ము పలికెను. హనుమాన్, నీవు ఒక సాధారణ మనుష్యుని వలె వారి వద్దకు వెళ్ళుము. వారి ఇరువురి చేష్టలద్వారా రామలక్ష్మణుల యదార్థ విషయమును తెలిసికొనుము.  అదివిన్న హనుమంతుడు, ఋష్యమూక పర్వతమునుండి రామ లక్ష్మణులు ఉన్నచోటుకు ఎగిరిపోయెను.  హనుమంతుడు తన రూపమును వదిలి భిక్షువు రూపము ధరించెను.  వారివద్దకువెళ్ళి  నమస్కరించి ఈ ప్రకారముగా సంభాషణమొదలిడెను.  వీరులారా, ఇక్కద్ర సుగ్రీవుడు అను శ్రేష్ఠవానరుడు కలడు. అతడు ధర్మాత్ముడు, వీరుడు. అతడి అగ్రజుడు వాలి. అతను దుర్బుద్ధితో సుగ్రీవుని భార్యను చెరబట్టెను. సుగ్రీవుని ఇంటినుండి తరిమివేసెను.  ఆ సుగ్రీవుడు పంపగా నేను ఇక్కడికి వచ్చితిని. నేనుకూడా వానరజాతికి సంబంధించినవాడినే. ఆ సుగ్రీవుడు పంపగా వచ్చినవాడను. నాపేరు హనుమంతుడు.  సుగ్రీవుడు మీతో స్నేహము చేయ దలంచినాడు.  నేను ఆ సుగ్రీవుని మంత్రిని.  నేను వాయుదేవతపుత్రుడను.  నేను నా ఇష్టమువచ్చినచోటికి వెళ్ళగలను. నేను ఇష్టము వచ్చిన రూపమును ధరించగలను.  ఇప్పుడు సుగ్రీవునకు ప్రియము కలుగజేయ వచ్చితిని. 

అదివిని శ్రీరాముడు మిక్కిలిసంతోషించెను.  తమ్ముడు లక్ష్మణునితో ఇట్లనెను.

నానృగేదవినీతస్య నా యుజుర్వేద ధారిణః

నా సామవేద విదుషః శక్యమేవం విభాషితుం                                    7

ఎవనికి ఋగ్వేదముయొక్క శిక్షణ లభించలేదో, ఎవడు యజుర్వేద అభ్యాసము చేయలేదొ, ఎవడు సామవేదమునందు విద్వాంసుడుకాడో, అట్టివాడు ఈ ప్రకారము సుందరభాష యందు సంభాషణ గావింపలేడు.

నూనం వ్యాకరణం కృత్స్నమనేన బహుధాశృతం

బహువ్యాహ రతానేన న కించిదప  శబ్దితం                       8

నిశ్చయముగా ఈతడు వ్యాకరణమునతను పెక్కుసార్లు స్వాధ్యాయము చేసియుండెను.  ఎందుకంటె ఎన్ని వాక్యములు పలికినను ఈయననోటినుండి ఒక్క అపశబ్దము కూడా  రాలేదు.

సంస్కారక్రమసంపన్నా మధ్భుతా మనిలంబితాం

ఉచ్చారయతి కల్యాణీం వాచం హృదయ హర్షిణీం                       9

ఇతడు సంస్కారము, క్రమశిక్షణలతో కూడినదియు, అద్భుతమైనదియు, అవిలంబితమైనదియు, హృదయమునకు ఆనందమును కలుగచేయునదియు, కల్యాణమయమైనదియు నగు వాక్కుతో పలుకుచున్నాడు.

అనయా చిత్రయా వాచా త్రిస్థాన వ్యఙ్జనస్థయా

కస్యనారాధ్యతే చిత్తముద్యతా పేరరేరపి                           10  

హృదయము, కంఠము, శిరస్సు, అను ఈ మూడు స్థానములద్వారా స్పష్టముగా అభివ్యక్తమగునట్టి, ఈ విచిత్రవాణినివినినచో, ఎవని మనస్సు ప్రసన్నముకాదు?  చంపుటకై ఖడ్గమును పైకెత్తిన శత్రువు యొక్క హృదయము కూడా ఇట్టి అద్భుతమగు వాక్కుచే పరిణామమును పొందగలదు.  

శ్రీరాముడు ఇట్లు చెప్పగా లక్ష్మణుడు హనుమంతునితో ఇట్లనెను.  హనుమాన్, మహాత్ముడగు సుగ్రీవుని గుణములు మాకు తెలిసినవి.  మేము ఇరువురము వానరరాజగు సుగ్రీవుని వెదుకుచు ఇచ్చటికి వచ్చితిమి.  సాధుశిరోమణివగు హనుమంతుడా, నీవు సుగ్రీవుని గూర్చి, మైత్రిని గూర్చి చెప్పినది మాకు అంగీకారయోగ్యము. అట్లే చేస్తాము.  పిమ్మట హనుమంతుడు శ్రీరామునితో ఇట్లు పలికెను.  పంపాతీరమునున్న ఈ వనము చాలా భయంకరము. దుర్గమము అయియున్నది.  ఈ వనమందు అనేక హింసాత్మక జతువులు నివసించుచున్నవి.  మీరు ఇక్కటికి ఎందుకు వచ్చితిరి?  హనుమంతుని ఈ వాక్యములను విని శ్రీరాముని ఈ విధముగా పరిచయముచేయనారంభించెను.   ఈ భూతలమున ధర్మజ్ఞుడైన దశరథుడు అనే మహారాజు ఉండెను.  అతడు స్వధర్మానుసారము నాలుగు వర్ణములవారిని చక్కగా పాలించుచుండెను.

శరణ్యః సర్వభూతానాం పితుర్నిర్దేశపారగః

జ్యేష్ఠో దశరథస్యాయం పుత్రాణాం గుణవత్తరః                        11                

మహారాజగు దశరథునికి నలుగురు పుత్రులు.  వారిలో పూజ్యుడు శ్రీరాముడు.  వీరిలో అందరికంరే అధికగుణవంతులు శ్రీరాముడు.  వీరు అందరికి శరణునొసగువారు.  వారు తండ్రి ఆజ్ఞను పాటించువారును అయియున్నారు.

ఆహామస్యావరో భ్రాతా గుణైర్దాస్య ముపాగతః

కృతజ్ఞస్య బహుజ్ఞస్య లక్ష్మణో నామ నామతః                                      12

నేను అనుంగు సోదరుడ్ని.  నా పేరు లక్ష్మణుడు.  నా అగ్రజుడు కృతజ్ఞుడు మరియు    అనేకవిషయములు తెలిసినవాడు.  అట్టి ఈ సోదరుని గుణములచే ఆకర్షించబడితిని. అందువలననే వీరికి దాసుడనైతిని.

సమస్త ప్రాణికోట్ల హితుడు. మహాత్ములచే పూజింపదగినవాడు. వనవాసమందు నా అగ్రజుని భార్యనుఒక రాక్షసుడు అపహరించెను.  ఆ అపహరించిన రాక్షసుని వెతుక్కుంటూ తిరుగుతున్నారము. ఇంతవరకు ఆ రాక్షసుని వెతుకుతూ తిరుగుతున్నాము అని కన్నీరు కారుస్తూ చెప్పెను.   

ఈదృశా బుద్ధిసంపన్నా జితక్రోధా జితేంద్రియాః

ద్రష్టవ్యా వానరెంద్రేణ దిష్ట్యా దర్శనమాగతాః                               13

రాజకుమారా, వానరరాజగు సుగ్రీవునకు మీవంటి ధీమంతులు, జితక్రోధులు, జితేంద్రియులునగు మనుజులతో కలయిక అవసరమైయున్నది.  అట్టి మీరు స్వయముగానే దర్శనమొసంగుట సౌభాగ్య విషయమైయున్నది.

సుగ్రీవుడు సూర్యనందనుడు.  సీతమ్మను వెతుకుటలో మాతోకూడా స్వయముగా ఉండి మీ అన్నదమ్ములిద్దరికి సహాయము చేకూర్చగలడు. ఈ ప్రకారముగా చెప్పి హనుమంతుడు శ్రీరామునితో ఇట్లనెను. “ఇప్పుడు మనము సుగ్రీవుని వద్దకు వెళ్ళెదము” అనెను. కపిశ్రేష్ఠుడగు హనుమంతుడు భిక్షుకరూపమును వదిలి వానరరూపమును ధరించెను. ఆ వీరులైన అన్నదమ్ములిద్దరినీ భుజములమీద ఎక్కించుకొని అచ్చటినుండి యెగిరి మలయపర్వతమువైపుకు పోయెను.  హనుమంతుడు అక్కడ సుగ్రీవునకు అన్నదమ్ము లిరువురుని పరిచయముగావించెను.  సుగ్రీవుడు శ్రీరామునితో అత్యంత ప్రేమతో ఇట్లు పలికెను.  శ్రేరామచంద్రప్రభో, మీరు సర్వధర్మపరాయణులు.  పవనపుత్రుడు హనుమంతుడు మీ గురించి సర్వము విశదపరచినాడు.  నేను మీ మైత్రిని అభిలషిస్తున్నాను. 

దానికి సతసించి శ్రీరాముడు స్నేహపూర్వకముగా సుగ్రేవుని చేతిని  వత్తెను.  సుగ్రీవుడు శ్రీరాముడు ఇరువురు అగ్నికి ప్రదక్షిణచేసిరి.  వాలిచే భయముచే పీడింపబడిన నాకు మీరు అభయహస్తమునొసగుడు.  సుగ్రీవునితో శ్రీరాముడిట్లనేను.  మీ భార్యను అపహరించిన వాలిని నేను సంహరించెదను. సుగ్రీవుడు శ్రీరామునితో ఇట్లనెను. హనుమంతుడు నా మంత్రులలో శ్రేష్ఠుడు. మీ భార్యను ఆయనద్వారా తప్పక వెతికించెదను.  సీతమ్మ ఎక్కడున్నను ఆమె జాడ తప్పక తెలిసుకొనెదను. 

ఇటీవల భయంకరమైన రాక్షుసుడు వేదనతో కూడిన ఒక స్త్రీని ఎత్తుకొని ఆకాశమార్గమున వెళ్ళుచుండెను.  ఆ స్త్రీ ‘రామా, లక్ష్మణ, అని అరచుచు వెళ్ళుచుండెను’. తప్పక ఆమె సీతమ్మయే అయిఉంటుంది.  ఈ పర్వత శిఖరమున నేను నా మంత్రులు కూర్చుండియుంటిమి.  ఆమే మమ్ములను చూచి కొన్ని సుందర ఆభరణములను మూటగట్టి క్రిందకి జారవిడచెను.  యిట్లు పలికి శ్రీరామునికి  ఆభారణముల మూటనుజూపెను.  రాముడు వాటిని గుర్తుపట్టేను. దుఃఖముతో మాటలు పెగల్లేదు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను.   

నాహం జానామి కేయూరే నాహం జానామికుండలే

నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్                             14

అగ్రజా, ఈ ఆభరణముల విషయము నాకు తెలియదు.  పాదములకు ధరియించు ఈ ఆభరణములు మాత్రము నాకు తెలియును.  ఎందుకంటీ ప్రతిదినము పాదాభివందనము చేయు చుందును కనుక.

శ్రీరాముని శోకము సుగ్రీవుని కన్నీరు కార్పింపజేసెను.  సుగ్రీవుడు గద్గదస్వరముతో ఇట్లు పలికెను.

భాష్పమా పతితం ధైర్యాన్నిగ్రహీతుం త్వమర్హసి

మర్యాదాం సత్వ యుక్తానాం ధృతిం నోత్రష్టుమర్హసి                               15  

ఓ, రామచంద్రా, మీరు ధైర్యమును అవలంభింపుడు.  కన్నీటిని ఆపివేయుడు. సాత్వికులు తమధైర్యమును వీడరాదు.

వ్యసనే వార్ధకృచ్ఛ్రే వా భయే వా జీవితాన్తగే

విమృశంశ్చ స్వయాబుద్ధ్యా ధృతిమాన్ నావసీదతి                   16   

శోకమందుగాని, ఆర్ధికవిషమ పరిస్థితులలోగాని, ప్రాణభాయము తటస్థించినపుడుగాని, ధర్యవంతుడు తనబుద్ధిని ఉపయోగించి నివారణోపాయమును ఆలోచించవలయును.  అట్టివాడు కష్టములను అనుభవించడు. 

బాలిశస్తు నరో నిత్యం వైక్లవ్యం  యోనువర్తతే

స మజ్జత్యవశః శోకేభారా క్రాంతేవ నౌర్జలే                                     17

ఏ మూర్ఖమానవుడు సదా కలవరబడుచుండునో, అట్టివాడు నీటియందు బరువుచే త్రొక్కబడిన నౌకవలె, శోకముచే వివశుడై దుఃఖములో మునిగిపోవును.

ఏషోఙ్జలిర్మయా బద్ధః ప్రణయాత్  త్వాం ప్రసాదయే

పురుషం శ్రయ శోకస్య నాంతరం దాతుమర్హసి                               18  

నేను చేతులు జోడించుకొని ప్రేమపూర్వకముగా చెప్తున్నాను.  మీరు ప్రసన్నులు కండు.  పురుషార్థము నాశ్రయింపుడు.  శోకమునకు తావునీయకుడు.

ఏ శోకమనువర్తంతెన తేషాం విద్యతే సుఖం 

తేజశ్చ క్షీయతే తేషాం న త్వం శోచితుమర్హసి                            19

శోకమును అనుసరించువానికి  సుఖము కలుగదు.  వారి తేజస్సు కూడా క్షీణించుచుండును.  కావున మీరు శోకింపవలదు.

శోకేనాభి ప్రసన్నస్య జీవితేచాపిసంశయః 

స శోకం త్యజ రాజేంద్ర ధైరమాశ్రయ కేవలం                          20 

రాజేంద్ర, శోకమువలన మనుజుని జీవిత సంరక్షణము కూడా సందేహములో పడిపోవును.  కావువ మీరు శోకమును వదిలిపెట్టుడు.  కేవలము ధైర్యమును అవలంభింపుడు.

హితం వయస్య భావేన బ్రూహి నోపదిశామితే

వయస్యతాం పూజయన్మే న త్వం శోచితుమర్హసి                                 21

నేను స్నేహపూర్వకముగా సలహామాత్రమే ఇచ్చుచుంటిని.  నేను మీకు ఉపదేశము ఇవ్వటం లేదు.  మీరు నన్ను నా మైత్రిని ఆదరించుడు. మీరు ఇందుమూలకముగా ఎన్నడు విచారించవలసిన పనిలేదు.

ఈ వాక్యములను విన్న శ్రీరాముడు శోకమును వదిలెను.  స్నేహపూర్వకముగా సుగ్రీవుని కౌగిలించుకొనెను.  శ్రీరాముడు ఇట్లనెను. “సుగ్రీవా, నేను వాలిని వధియించెదనని చేసిన వాగ్దానము తప్పక నెరవేర్చెదను.   ఇది సత్యం. 

అనృతం నోక్తపూర్వం మేనచ పక్ష్యే కదాచన

ఏతత్తే ప్రతిజానామి సత్యేనైవ శపామ్యహం                              22

నేను లోగడ అసత్యము పలుకలేదు.  ఇహ ముందర అసత్యము  చెప్పబోను. ఇప్పుడు చెప్పినదానిని తప్పక నెరవేర్చెదను. ఆవిధముగా ప్రతిజ్ఞ చేయుచుంటిని.  మీకు విశ్వాసము కలుగచేస్తున్నాను.

ఉపకారఫలం మిత్రమపకారోరి లక్షణం

అద్యైవ  తమ్ వదిష్యామి తవ భార్యాపహారిణం                                  23

మిత్రమా, మిత్రత్వముయొక్క ఫలము ఉపకారమే.  శత్రుత్వము యొక్క ఫలము అపకారమే.  కావున మీ భార్యను అపహరించిన వాలిని ఈ క్షణమే వధియించెదను.

పిమ్మట అభిమానధనుడైన శ్రీరామచంద్రమూర్తి తన విల్లు బాణములను గైకొని దిక్కులు పిక్కటిళ్ళెటట్లు ధనుష్ఠంకారము చేసెను.  బాణమును సాలవృక్షములవైపు వదిలెను. వీర శ్రేష్టుడైన రామునిచే వదలబడిన ఆ బాణము ఒకేసారి ఏడు సాలవృక్షములను ఛేదించి తిరిగి  పాతాలమునకేగి తిరిగి తన అంబులపొదిలోనికి ప్రవేశించెను.  అదిచూచి సుగ్రీవుడు అమిత ఆశ్చర్యమును పొందెను.  అంతట సుగ్రీవుని కౌగిలించుకొని శ్రీరాముడు ఇట్లుచెప్పెను.  సుగ్రీవా, మనమిప్పుడు కిష్కింధవెళ్ళెదము. సుగ్రీవ, మీరు వాలిని యుద్ధమునకు ప్రేరేపింపుడు.  మిమ్ములను గుర్తించుటకై ఏదియేని ఒక చిహ్నమును ధరియించుడు.  అప్పుడు లక్ష్మణుడు రాముని ఆజ్ఞచే ఒక పుష్పమాలను సుగ్రీవుని మెడలో వేసెను.  అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని వెంటనిడుకొని ఋష్యమూక పర్వతమునుండి కిష్కింధపురివైపునకు వెళ్ళెను. ఒక దట్టమైన వనమునుజూచి సుగ్రీవునితో శ్రీరాముడు ఇట్లనెను. మిత్రమా, సుగ్రీవా, ఈ వనమేమో తెలిసికొనగోరుచున్నాను. నడుస్తూనే సుగ్రీవుడు ఆ వనమునుగురించి శ్రీరామునకు ఇట్లుచెప్పెను. 

ఏతద్ రాఘవ విస్తీర్ణ మాశ్రమం శ్రమనాశనం

ఉద్యానవనసంపన్నం స్వాదుమూల ఫలోదకం                                24 

రామచంద్ర,  సర్వులశ్రమను పోగొట్టు ఒక విశాలమైన ఆశ్రమం ఇది.  ఇది ఉద్యానవనములతోను, ఉపవనములతోను కూడియున్నది.  ఇక్కడ రుచికరమైన ఫలములు జలములు లభ్యమగును.

ఈ ఆశ్రమమునండు ప్రసిద్ధికెక్కిన ఏడుగురు మునులు నివసించుచుండిరి.  వారు కఠినవ్రతచిత్తులు.  జలముపై పరుండేవారు.  కేవలము వాయుభక్షణచేసేవారు.  ఒకేస్థానమందు నిశ్చలభావముతో ఉండేవారు.  వారు ఏడువందలసంవత్సరములు ఘోర తపస్సు చేసిరి.  శ్రీరామలక్ష్మణులిరువురు వారికి పాదాభివందనము చేసిరి. కిష్కింధాపురి చేరినవెంటనే, సుగ్రీవుడు పెద్దగా ఘర్జన చేసెను.  అప్పుడు వాలిభార్య తార భీతిల్లెను.  తార వాలిని కౌగిలించుకొని స్నేహప్పూర్వకముగా ఇట్లు పలికెను.

సాధుః క్రోధమిమం వీర నదీవేగమివాగతం  

శయనా దుత్థితః కాల్యం త్యజ భుక్తామివస్రజం                         25   

వీరుడా, నా వాక్యమువింటివా?  నదియొక్క వేగమువలె ఈ పెల్లుబికివచ్చు కోపమును వదలివేయుము.  ఉదయము లేవంగానే రాత్రి ధరించిన పుష్పమాలను వదిలివేసినట్లు ఈ క్రోధమును వదిలివేయుము.

ఈ సుగ్రీవుడు ఎవడో సహాయము చేయకుండా ఇక్కడికి రాడు.  ఆ అండ జూచ్కొనే ఈ ప్రకారము ఘర్జనచేయుచున్నాడు.  కుమారుడు అంగదుడు ఒక రోజున వనమునకు పోయెను.  అక్కడ గుప్తచరులు అతనికి ఒకసమాచారమునిచ్చిరి.  దానిని అంగదుడు నాకు చెప్పెను.  అది ఏదనగా అయోధ్యరాజునకు నలుగురు పుత్రులు.  వారందరు వీరపుత్రులు.  వారిని యుద్దమందు జయించుట అసంభవమ. వారి జన్మ ఇక్ష్వాకు వంశమందు సంభవించెను.  వారిలో రామలక్ష్మణులు ప్రసిద్ధులు.  వారు ఇప్పుడు ఇటు వనమునకు వచ్చితిరి. వీరులైన వారు ఇరువురు సుగ్రీవునకు ప్రియమితృలు.  వారు ఇరువురు సుగ్రీవునకు సహాయము చేయ నిశ్చయించిరి.

రామః పరబలామర్దీ యుగాన్తాగ్నిరివోత్థితః

నివాసవృక్షః సాధూనమాపన్నానాం పరాగతిః                          26   

శ్రీరాముడు శతృసేనను సంహరించేవాడు. ఆయన ప్రళయాగ్నివలె తేజస్వి. వారు సజ్జనులకు ఆశ్రయమిచ్చువారు. వారు కల్పవృక్షమువంటివారు.  మరియు ఆపదయందు ఉన్నవారికి గొప్పసహాయమొనర్చువారును అయిఉన్నారు.

ధాతూనామివ శైలేన్ద్రో గుణానామాకరో మహాన్

తత్ క్షమోన విరోధస్తే సహ తేన మహాత్మనా

దుర్జయేనా ప్రమేయేణ రామేణ రణకర్మసు                                     27

పర్వతరాజు అయిన హిమవతుడు సమస్తధాతువులకు నిలయము.  అదేవిధముగా శ్రీరాముడు సమస్త ఉత్తమగుణములకు నిధిభాండారము.  కావున అట్టి మహాత్మునితో విరోధము ఎన్నటికి సముచితము కానేకాదు.  ఎందుకంటె ఆ శ్రీరామచంద్రునకు యుద్ధము నందు సాటిరాగల ధీరుడు మరియొకడు లేనేలేడు.  వారిని జయించుట అసంభవం.

వీరుడవగు వాలి, సుగ్రీవుడు మీ అనుంగు సోదరుడు.  నేను మీ హితముకోరి చెప్తున్నాను.  మీరు నేను చెప్పిన వాక్యములు శ్రద్ధగా వినుడు.  శ్రీరామునితో యుద్ధము చేయుట సముచితము ఎన్నటికీ కాదు. తార చెప్పిన ఈ మాటలు విని వాలి తారను మందలించి ఇట్లు పలికెను.  నీవు ఈ స్త్రీలను తీసికొని వారితో వెంటనే వెనక్కి వెళ్ళుము.  నేను యుద్ధమున నా సోదరుడు సుగ్రీవుని జయించి వచ్చెదను.  నీకు ఎక్కువ చెప్పవలసిన పని లేదు.  అక్కడినుండి సుగ్రీవుని వడిసిపెట్టి కొట్టెను.  సుగ్రీవుడు రక్తము వమనముచేసేను.  అంతట శ్రీరాముడు చేట్టుచాటునుండి వాలిని క్రింద పడగొట్టేను.  అప్పుడు రామలక్ష్మణులను చూచి వాలి వినయముగా ఇట్లనెను.   

దమః శమః క్షమా ధర్మోధృతిః సత్యం పరాక్రమః

పార్ధివానాం గుణారాజన్ దండశ్చాప్యపకారిషు                                    28   

రాజా, ఇంద్రియ నిగ్రహము, మనస్సంయము, క్షమ, ధైర్యం, ధర్మం, సత్యం, పరాక్రమము,  అపరాథము ఒనర్చినవారికి దండననొసంగుట—ఇవి రాజుయొక్క గుణములు.

భూమిర్హిరణ్యం  రూపంచవిగ్రహే కారణానిచ

తత్ర కస్తే వనే లోభో మదీయేషు ఫలేషువా                                      29 

భూమి, బంగారము, వెండి ఇవియే రాజులమధ్య వైరమునకు మూలకారణము. కాని ఇక్కడ మూడును లేవు. ఈ దిక్కునందు, ఈ వనమునందు, లేక మా ఫలములందు మీకు లోభమును కలుగజేసినది ఏమి?

నయశ్చ వినయశ్చోభౌ నిగ్రహానుగ్రహానపి

రాజవృత్తి సంకీర్ణా న నృపాః కామ వృత్తయః                                     30

నీతి, వినయము, దండనము, అనుగ్రహము, -- ఇవి రాజధర్మములు.   కాని వీని అవసరము భిన్న భిన్న అవసరములయందు కలుగుచుండును.  రాజులు స్వేచ్ఛా కారులు కారాదు.

రాజహా బ్రహ్మహా గోఘ్నశ్చోరః ప్రాణివధేరతః

నాస్తికః పరివేత్తా చ సర్వే నిరయగామినః                                      31

రాజును వధించువాడు, బ్రహ్మహత్యచేయువాడు, గోవధగావించువాడు, చోరుడు, ప్రాణులను హింసించుటయందు తత్పరుడైయుండువాడు, పరివేత్త అనగా అన్న అవివాహితుడైయుండ వివాహము చేసికొనువాడు, వీరందరు నరకము పొందుదురు.

సూచకశ్చ కదర్యశ్చ మిత్రఘ్నో గురుతల్పగః

లోకం పాపాత్మనామేతే  గచ్ఛంతే నాత్రసంశయః                             32

చాడీలు చెప్పేవాడు, లోభి, మిత్రఘాతకుడు, గురుపత్నితో సహగమనముచేయువాడు, వీరు పాపులలోకమునకేగేదరు.  ఇందు ఏమాత్రము సందేహములేదు. 

నా భార్య తార సర్వజ్ఞురాలు.  ఆమె నాతొ సత్యమైన హితకరమైన వాక్యము చెప్పినది.  కానని ఆ హితవాక్యములను పెడచెవిని పెట్టితిని.  ఏ ఉద్దేశ్యముతో నన్ను వధించిరో నాకు అవగతము కాలేదు. నాకు చెప్పినట్లయితే ఒక్కరోజులో సీతమ్మను వెదకి మీకు అప్పగించేవాడిని.  సీతమ్మను అపహరించిన రావణుని ఈడ్చుకువచ్చి మీ ముందరపడవేసియుండెడివాడను. 

కామమేవం విధోలోకః కాలేన వినియుజ్యతే

క్షమం చద్భవతా ప్రాప్తముత్తరం సాధుచిన్త్యతాం                                 33

ఈ ప్రపంచము ఏదోఒకరోజున కాలమునకు అధీనము తప్పక అగును. కాల స్వభావమే అది.  నాకు మృత్యువు సభావించినను నేను వ్యాకులత చెందుటలేదు. కాని నన్ను ఈ విధముగా చంపుటకు సముచితమైన కారణము తప్పక తెలియజేయగలరు.

ఈ ప్రకారము వానరశ్రేష్ఠుడగు వాలిమాటలువిన్న శ్రీరామచంద్రుడు వాలితో ధర్మప్రకారము ఈ వాక్కులు పలికెను.  

నయశ్చ వినయోశ్చోభౌ యస్మిన్ సత్యం చ సుస్థితం

విక్రమశ్చ యథా దృష్టః స రాజా దేశాకాలవిత్                34

ఎవనియందు నీతి, వినయము, సత్యము, పరాక్రమము, ఇత్యాది సమస్త రాజోచిత గుణములు యథారూపమున  ఉండునో, అట్టివాడే దేశకాలతత్వమును ఎరిగిన రాజు అగును.

తే వయం మార్గావిభ్రష్టం స్వధర్మే పరమే స్థితాః

భరతాజ్ఞాం పురస్కృత్య నిగ్రుహ్ణీమో యథా విధి                       35

మేము శ్రేష్ఠమైన ధర్మమునంది స్థిరముగా ప్రతిష్ఠించబడినవారము.  భరతుని  ఆజ్ఞను పురస్కరించుకొని ధర్మమార్గమునుండి భ్రష్తుడైనవానికి అవశ్యము విదిపూర్వకముగా దండించెదము.

జ్యేష్ఠో భ్రాతా పితావాసి యశ్చ విద్యాం ప్రయచ్ఛతి

త్రయస్తే పితరో జ్ఞేయా ధర్మేచ పథివర్తినః                                       36

జ్యేష్ఠ సోదరుడు, తండ్రి, విద్యనొసగు గురువు వీరు మువ్వురును ధర్మమార్గమున నడుచు వారికి మార్గదర్శన చూపవలయును. 

సూక్ష్మః పరమ దుర్జ్ఞేయః సతాం ధర్మః ప్లవఙ్గమ 

హృదిస్థః సర్వభూతానామాత్మా వేదం శుభాశుభం                           37 
వానరా, సజ్జనుల ధర్మము అతిసూక్ష్మము మరియు దుర్జ్ఞేయము.  దానిని తెలిసికొనుట అతి కష్తము.  సమస్త ప్రాణులయందు విరాజమానుడై యున్న పరమాత్మయే అందరి శుభాశుభాములను తెలిసికొనుచున్నాడు.

మహాత్ముడగు సుగ్రీవుడు జీవించియుండగానే అతని పత్నియగు రుమను కామవశమున ఉపభోగించుచున్నావు.  కావున నీవు పాపాత్ముడవు. ఇందు ఏమాత్రము సందేహము లేదు.  నీవు ధర్మభ్రష్ఠుడవు.  అందువలననే నీకు సముచిత దండననొసంగబడినది.

భరతస్తు మహీపాలో వయం త్వాదేశవర్తినః

త్వంచ ధర్మాదతిక్రాన్తః కథం శక్యముపేక్షితుం                       38

మా రాజు భరతుడు.  మేము కేవలము అతని ఆజ్ఞను పాలించువారము.  నీవు ధర్మమునుండి జారిపోతివి.  ఇక నిన్ను ఎట్లాఉపేక్షించగలము? 

ఈ మాటలువిన్న వాలి మనస్సునకు చాలా బాధకలిగెను.  ధర్మతత్వముయొక్క నిశ్చయము తెలిసెను.  శ్రీరామునియడల దోషచింతనను వదిలెను.  తదుపరి సెతులుజోడించి వాలి ఇట్లు పలికెను.  నరశ్రేష్టా, మీరు చెప్పినది పరమ సత్యము.  ఇందు సందేహములేదు.  మీచేతుల్లో చావవలెనని నా కోరిక.  అందుకనే తార యెంత వారించినప్పటికీ నేను నా సోదరుడు సుగ్రీవునితో ద్వంద్వ యుద్ధమునకు తలపడితిని.  నేను మీద్వారా నా ప్రశ్నలకు సమాధానము పొందితిని.  అమిత దుఃఖవతియైన వాలి భార్య తారను హనుమంతుడు ఓదార్చెను.

గుణతోషకృతం జంతుః  స్వకర్మ ఫలహేతుకం

అవ్యగ్రస్ ద వా ప్నోతి  సర్వం ప్రేత్య శుభాశుభం                 39

దేవీ, గుణబుద్ధి వలనగాని, దోషబుద్ధివలనగాని జీవుడు కర్మలు చేయును. చేయుచుండును. అవి అతనికి సుఖదుఃఖఫలములను చేకూర్చును.  పరలోకమునకేగి ప్రతి జీవి శాంతముగా తనయొక్క సమస్త శుభ అశుభ కర్మలయొక్క ఫలమును అనుభవించుచుండును.

జానాస్యనియతా మేనం భూతానామాగతిం గతిం 

తస్మాచ్చుభం హి కర్తవ్యమ్ పండితే నేహ లౌకికం                     40

దేవి, నీవు తెలివిగలదానవు.  ప్రాణుల జనన మరణములకు నిశ్చితసమయము లేదు.  అందువలన శుభకర్మలను జీవుడు చేయుచునే ఉండవలయును.,  వ్యాకుల పడకూడదు. 

పిమ్మట యుద్దమందు జయమొందిన సోదరుడు సుగ్రీవునితో వాలి ఇట్లనెను. 

సుగ్రీవదోషేణ న మాం గంతుమర్హసి కిల్బిషాత్ 

కృష్యమాణం భవిష్యేణ బుద్ధిమోహేన మాం బలాత్               41

సుగ్రీవా, పూర్వజన్మలయందు నేను పాపముచేసితిని. అందువలన నా బుద్ధి నన్ను బలవంతముగా దోషమువైపే లాగినది. కనుకనే నిన్ను శత్రువుగా తలంచితిని.  ఇక్కారణమున చేసిన అపరాథమునకై నన్ను దోషిగానెంచకుము. 

సుగ్రీవ, ఈ దివ్యమైన సువర్ణమాలను ధరింపుము.  నా మరణానంతరము దీని శక్తి మరియు శోభ తగ్గిపోవును.  కావున ఇప్పుడే దీనినినీవు ధరింపుము.  తత్తదుపరి తను మరణించుట నిశ్చయమని తెలిసికొన్న వాలి తన కుమారుడు అంగదుని పిల్చి ఇట్లు చెప్పెను.

దేశకాలౌ భజస్వాద్య క్షమమాణః ప్రియాప్రియే

సుఖదుఃఖసహః కాలే సుగ్రీవవశగోభవ                                            42

కుమారా, అంగడా, దేశాకాలములనేరిగి ఎప్పుడు ఎచ్చట ఏ విధముగా ప్రవ్ర్తిమ్పవలయునో ద్రుధముగా నిశ్వయించి మరీ ప-రావర్తిమ్పుము.  సమయానుసారము తటస్థించునట్టి ప్రియాప్రియములను, సుఖదుఃఖములను ఓర్చుకొనుము.  ఓర్పు కలిగియుండుము.  మరియు సుగ్రీవుని ఆఙ్ఞకు బద్ధుడవైయుండుము.

అంతట వాలి మరణమునొందెను.  అతని ప్రాణహంస ఎగిరిపోయెను.  అప్పుడు అతివ్యాకులతతో రోదించుచు తార శ్రీరామునితో ఇట్లనెను.  మీరు వాలిని వధించిన బాణముతో నన్నుకూడా వధింపుము.  నేను లేక నా భర్త వాలి సుఖముగానుండజాలడు. 

ఇత్యేవ ముక్తస్తు విభుర్మహాత్మా తారాం సమశ్వాస్య హితం బభాషే

మా వీర భార్యే విమతిం కురుష్వ లోకోహి సర్వో విహితో విధాత్రా                 43

తార ఈ ప్రకారముగా పలుకగా, మహాత్ముడగు శ్రీరాముడు తారను ఊరడించి ఇట్టి హితవాక్యమును చెప్పెను.  వీరపత్నీ, నీవు మృత్యు విషయకమైన విపరీత మైన విచారణను వదిలివేయుము.  ఎందుకంటె విధాత ఈ సమస్త జగత్తుయొక్క విధి విధానమును ఏర్పాటు చేసియున్నాడు.  

తంచైవ సర్వం సుఖదుఃఖయోగం లోకోబ్రవీత్ తేనకృతం విధాత్రా

త్రయోపి లోకా విహితం విధానం నాతిక్రమంతే వశగా హి తస్య                         44

విధాతయే ఈ ప్రపంచమునంతను సుఖ దుఖములతో కూడియున్నదానినిగా చేసెను.  ఈ విషయమును సామాన్యజనులు కూడా చెప్పగలరు. ముల్లోకములందలి ప్రాణులు విధాతయొక్క విధానమును ఉల్లఘించజాలరు.  ఎందుకంటె విధాతకు అందరు అధీనులే. 

ప్రీతిం పరాం ప్రాప్స్యసితాం తథైవ పుత్రశ్చ తే ప్రాప్స్యతి యౌవరాజ్యం

ధాత్రా విధానం విహితం తథైవ  న శూరపత్న్యః పరిదేవయంతి                   45

నీవు ఇదివరకటి మాదిరిగానే మహాసుఖమును ఆనందమును అనుభవించెదవు.  మరియు నీ పుత్రుడు యువరాజు అగును.  విధాత విధానము ఇట్లాగే ఉన్నది.  శూరవీరుల భార్యలు ఈ విధముగా వ్యాకులతచెందరు.

న శోకపరితాపపేన శ్రేయసాయుజ్యతే మృతః

య దత్రానంతరం కార్యం తత్ సమాధాతు మర్హథ                       46

శోకించటచే పరితపించుటచే చనిపోయిన జీవునకేమి లాభము?  కావున మున్ముందు చేయవలసిన కర్తవ్యమును విధిపూర్వకముగా చేయవలయును.

నియతిః కారణం లోకే నియతిః కర్మసాధనం 

నియతిః సర్వభూతానాం నియోగేష్విహ కారణం                                     47  

ప్రపంచమున నియతికే అన్నింటికీ మూలకారణం.  సమస్త కర్మలయొక్క సాధనము నియతియే.  నియతియే సమస్త ప్రాణులను విభిన్న కర్మలయందు నియుక్త మొనర్చుటకు కారణమైయున్నది.

తదుపరి వాలి శవమునకు దహనసంస్కారములు గావించబడినది.  వానరులందరూ జలాంజలి నొసంగుటకై పవిత్ర జలముచే పరిపూర్ణమైనదియు మంగళకరమైనదియు అగు తుంగభద్రానదియొక్క తీరమునకు బోయిరి.  హనుమంతుడు శ్రీరామునితో ఇట్లనెను.  దేవా మీరు పర్వతగుహయగు కిష్కింధకు దయజేసి సుగ్రీవుని పట్టాభిషేకమును జరిపింవుడు.  అప్పుడు శ్రీరాముడు ఇట్లనెను.

చతుర్దశ సమాః సౌమ్య గ్రామం వా యదివా పురం

న ప్రవేక్ష్యామి హనుమన్ పితుర్నిర్దేశ పాలకః                          48

మిత్రమా ఆంజనేయా, నేను నా తండ్రి ఆజ్ఞను పాలించుచున్నాను.  కనుక పదునాలుగు సంవత్సరములు పూర్తికానంతవరకు ఏ గ్రామమునందు లేక పట్టణమునందు ప్రవేశించను.

హనుమంతునితో ఇట్లుచేప్పిన అనంతరము  శ్రీరాముడు సుగ్రీవునితో ఇట్లు చెప్పెను.  సుగ్రీవా, మీరు లౌకిక శాస్త్రీయ వ్యవహారములన్ని తెలిసివాడివి.  కుమారుడు అంగదుడు సదాచారసంపన్నుడు.  అంగదుడు వీరత్వము మూర్తీభవించినవాడు. అంగదునికి యువరాజును చేయుడు. కార్తీక మాసము వచ్చిన పిమ్మట రావణవధ విషయమై ప్రయత్నింపుడు. ఇదియే మా నిశ్చయము.  తదుపరి సుగ్రీవుని రాజ్యాభిషేకము జరిగెను.  సుగ్రీవుడు కిష్కింధయందు నివసింపసాగెను.  అప్పుడు సోదరుడు లక్ష్మణునితో కలిసి శ్రీరాముడు ప్రస్రవణ పర్వతము పైకి వెళ్ళెను.  అత్తరి హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వచ్చెను.  హనుమంతుడు ఇట్లుచేప్పెను. శ్రీరాముడు మనకు పరమ మిత్రుడు.  వారి కార్యమునకు సమయము మించిపోవుచున్నది. కనుక వెంటనే సీతమ్మను వెతుకుట ఆరంభించవలయును.  సుగ్రీవుడు సత్వగుణసంపన్నుడు. అతడు దృఢ నిశ్చయము చేసికొనెను.  అందుకని వానర వీరులను అన్నిదిక్కులకు పంపెను.  అంతేకాదు, కార్యశీలుడైన నీలుడు అను వానరునకు యూథపతులందరును సమావేశము అగుటకు ఆజ్ఞాపించెను.

రాముడు లక్ష్మణునితో ఇట్లనెను. సుగ్రీవుడు సరయిన సహాయముచేయుటలేదు.  సుగ్రీవుడు సీతను వెదకుటకు సమయమును నిశ్చయించెను. కాని ప్రయత్నము చేయటం లేదు.  లక్ష్మణా, నీవు కిష్కింధా పురమునకు వెళ్ళుము. విషయలోలుడైన సుగీవునితో నా మాటగా ఇట్లా చెప్పుము.

అర్థి నామువ పన్నానాం పూర్వం చాప్యు పకారిణాం

ఆశాం సంశ్రుత్య యో హన్తి స లోకే పురుషాధమః                        49  

ఎవడు బలపరాక్రమములతో కూడియున్నవాడై, ఉపకారము చేయువారికి ముందుగా ఆశచూపి తరువాత దానిని భగ్నమొనర్చరాదు.  అట్లుచేసినచో అతడు అందరికంటే నీచుడే అగును.

కురుష్వ సత్యం మమ వానరేశ్వర ప్రతిశ్రుతం ధర్మమపేక్ష్య శాశ్వతం

మా వాలినం ప్రేతగతో యమ క్షయే త్వమద్య పశ్యేర్మమ చోదితః శరైః        50 

వానరరాజ, సుగ్రీవ, నీవు ధర్మమును అనుసరించుము.  నీవు చేసిన ప్రతిజ్ఞను నేరవేర్చుకొనుము.  లేనిచో ఈ క్షణమే నా బాణముతో హతుడవయ్యెదవు. వాలివలె నిన్నుకూడా యమలోకమునకు పంపెదను. 

అప్పుడు లక్ష్మణుడు శ్రీరామునితో ఇట్లు పలికెను.  ఆర్యా, సుగ్రీవును బుద్ధి భ్రష్టుపట్టినది. అందువలననే సుగ్రీవుడు నిత్యభోగాలాలసుడయ్యెను.  మీ దయవలననే అతనికి రాజ్యము సంప్రాప్తించినది.  అతడు చనిపోయి వాలిని దర్శించుగాక.  అతనికి తన ఉపకారమును తీర్చుకోను జ్ఞానములేదు. అతనిని ఇప్పుడే వధించెదను.  ఇట్లు చెప్పి లక్ష్మణుడు ధనుర్బాణములను తీసికొని వెంటనే వడివడిగా సుగ్రీవుని వైపు అడుగులువేస్తూ వెళ్ళతాకు ఉద్యమించెను. లక్ష్మణుని శాంతపరుస్తూ శ్రారాముడు ఇట్లనెను.

సహివై తవ ద్వి ధో లోకే పాపమేవం సమాచరేత్

కోపమార్యేణ యో హన్తి స వీరః పురుషోత్తమః                        51

లక్మణా, నీవంటి శ్రేష్ఠ పురుషులు ఇట్టి ప్రతిజ్ఞ చేసి పాపము మూటకట్టుకొనకూడదు.  ఎట్టివీరుడు ఉత్తమ వివేకమునుపయోగించి కోపమును చంపుకొనునో అట్టివాడే మనుజశ్రేష్ఠుడు.

నేదమత్ర త్వయా గ్రాహ్యం సాదువృత్తేన లక్ష్మణ

తాం ప్రీతిమనువర్తస్వ పూర్వవృత్తం చ సంగతం                               52

లక్ష్మణ, నీవు సద్గుణవంతుడవు.  నీవు సుగ్రీవుని వధింప నిశ్చయము చేయవలదు.  నీకు ఇంతకూ ముందర సుగ్రీవుని పై నీ కెట్టి ప్రేమగలదో దానినే అనుసరించుము. పూర్వపు మిత్రత్వమునే అనుసరించుము.  

తనసోదరుడు శ్రీరామచంద్రుని హితవాక్యములను విని లక్ష్మణుడు శాంతించెను. కిష్కింద పట్టణమున ప్రవేశించెను.  సుగీవుడు ధైర్యము కూడగట్టుకని తార భార్య అతిలోక సుందరి యగు తారతో ఇట్లనెను.   నీవు ఎట్లయినను లక్ష్మణుని శాంత పరచుము.  అప్పుడు తార లక్ష్మణునితో ఈ అనునయ మాటలు పలికెను.  రాజకుమారా, మీ ఆగ్రహమునకు కారణమేమి? మీరు అనుగ్రహించుడు. లక్ష్మణుడు శాంతించెను. వానరరాజగు సుగ్రీవుడు సీతమ్మను వెదుకుటకు ప్రతిజ్ఞ చేసి నాలుగు నెలలు అయినది.  కాని అతుడు మధిర మగువలతో కామక్రీడ చేయుచున్నాడు.  గడిచిపోయిన సమయము సుగ్రీవునికి గుర్తులేదా ఏమి? అనెను.

నహి ధర్మార్థ సిధ్యర్థం పానమేవం ప్రశస్యతే

పానాదర్థశ్చ కామశ్చ ధర్మశ్చ పరిహీయతే                                53

ధర్మము మరియు అర్థముల సిద్ధి కొరకై  ప్రయత్నము సలుపువానికి ఈ ప్రకారము మధిర మగువ మత్తులలో తేలియాడుట యుక్తము కానేకాదు. ఎందుకంటె మధిర మగువలతో ధర్మమూ అర్థము కామము (న్యాయమైన కోరిక)మూడు నశించిపోవును. 

ధర్మలోపో మహాంస్తావత్ కృతే హ్యప్రతి కుర్వతః

అర్థలోపశ్చ మిత్రస్య నాశేగుణవతో మహాన్                                        54

మిత్రుడు చేసిన ఉపకారమునకు సమయమువచ్చినప్పుడు ప్రతుపకారముచేయనిచో ధర్మమునకు హాని కలుగును.  గుణవంతుడయిన మిత్రునితోటి సత్సంబంధము చెడినచో అర్థమునకు హానికలుగును. 

మిత్రం హ్యర్థగుణశ్రేష్ఠం  సత్యధర్మపరాయణం

తద్ ద్వయం తు పరిత్యక్తం నతు ధర్మే వ్యవస్థితం                       55

మిత్రులు రెండు రకములు. ఒకడు అర్థసాధనకు సహాయముచేయును. మరియొకడు సత్యము ధర్మమూ రెండింటినీ ఆశ్రయించుకొనియుండును. సుగీవుడు రెండు గుణములను వదిలిపెట్టెను.  సుగ్రీవుని మిత్రుడు శ్రీరామచంద్రుని కార్యమును నెరవేర్చ లేదు.  స్వయముగా ధర్మభ్రష్టుడయ్యెను.

లక్ష్మణుని వాక్యములు ధర్మార్థముల నిశ్చయముతో కూడుకొనియుండెను.  ఆ వాక్యములయొక్క మధురస్వభావమును గాన్పడుచుండెను.  అదివిన్న తార విశ్వాస యోగ్యమైన మాటలు లక్ష్మణునితో ఇట్లుపలికేను.

కోపం కథం నామ గుణప్రకృష్టః కుమార కుర్వాద ప్రకృష్ట సత్వేః

క స్త్వద్విధః కోపవశం హి గచ్ఛేత్ సత్వావ రుద్ధస్తపసః ప్రసూతిః           56

రాజకుమారా, గునశ్రేష్ఠుడు గునహీణుడియడల క్రోధమెట్లు కలిగియుండును?  మీరు సత్వగుణములతో కూడుకోనియున్నవారు. మీరు శాస్త్ర విరుద్ధప్రవర్తనయందు తగుల్కొనరు.  అట్టి మీరు క్రోధమునకు వశుడెట్లు అగును?

న కామ తంత్రే తవ బుద్ధిరస్తి త్వం వై యథా మన్యువశం ప్రపన్నః

న దేశకాలౌ హి యదార్థ ధర్మా న వేక్షతే  కామరతిర్మనుష్యః                57

మీరు క్రోధమునకు వశులగుట చూడగా కామాదీశుని స్థితి మీరు ఎరుగనట్లున్నది.  కామాసక్తునకు దేశ, కాల, అర్థ, ధర్మముల జ్ఞాన మేమియు ఉండదు.

అంతట శాంతుడై లక్ష్మణుడు సుగ్రీవుని భవనములోని కెళ్ళెను.  సుగ్రీవునితోడ అతని భార్య రుమకూడయుండెను.  సుగ్రీవుడు స్త్రీలమధ్య నక్షత్రములమధ్య చంద్రుని వలే శోభించుచుండెను.  సుగ్రీవునిజూచి కోపముతో లక్ష్మణుడు ఇట్లు పలికెను.

సత్వాభిజన సంపన్నః సానుక్రోశో జితేన్ద్రియః

కృతజ్ఞః సత్యవాదీ చ రాజాలోకే మహీయతే                       58

వానరరాజా, సుగ్రీవా, ధీరుడు, కులీనుడు, దయాళువు, జితేంద్రియుడు, సత్యవాది అగు రాజునకే ఈ లోకమున ఆదరణ లభించును.    

యస్తు రాజా స్థితో ధర్మే మిత్రాణా ముపకారిణాం

మిథ్యా ప్రతిజ్ఞాం కురుతే  కో నృశంశ తరస్తతః                        59

రాజు అధర్మమందు ప్రవర్తించుచున్నప్పుడు ఉపకారమొనర్చిన మిత్రులకు న్యాయమెట్లు చేకూర్చగలడు?  అట్టివాడు చేసిన ప్రతిజ్ఞను భంగమొనర్చుటయందే సమర్థుడగును.  వాడిని మించిన క్రూరుడు ఇంకెవ్వడు ఉండడు.  

గీతోయం బ్రహ్మణా శ్లోకః సర్వలోక నమస్కృతః

దృష్ట్వా క్రుతఘ్నం క్రుద్దేన తన్నిబోధ ప్లవంగమ                       60

కపిరాజా, ఒకానొక కృతఘ్నునిజూచి కుపితుడై బ్రహ్మ  సర్వులకు ఆదరణీయమైన ఒక శ్లోకమును చెప్పెను. దానిని వినుము.

గోఘ్నేచైవ సురాపే చౌరే భగ్నవ్రతే తథా

నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతిః                  61

గోవధ చేసినవానికి, మద్యము సేవించినవానికి, దొంగతనముచేసినవానికి, వ్రతభంగాము చేసినవానికి, నిష్కృతి లేదు.  కాని కృతఘ్నునకు ఏ ప్రాయశ్చిత్తములేదు. 

నీవు నీ ప్రతిజ్ఞను భంగమొనర్చినావు.  లక్ష్మణుడు తన తేజస్సులో ప్రకాశించుచుండెను.  అతని వాక్యములను విని తార ఇట్లనెను.

నచ రోషవశం తాత గంతుమర్హసి లక్ష్మణ

నిశ్చయార్థమ విజ్ఞాయ సహసా ప్రాకృతో యథా                    62

మహాగుణవంతుడవైన లక్ష్మణ, యదార్థవిషయములను తెలిసికోకుండా మీరు సామాన్య వ్యక్తివలె క్రోధమునకు వశులుకాకూడదు.

సావయుక్తాహి పురుషాస్త్వద్విధాః పురుషర్షభ

అవిమృశ్య న రోషస్య సహసా యాంతి పశ్యతాం                      63  

పురుషశ్రేష్ఠా, మీ వంటివారు బాగా విచారించియే క్రోధవశులయి ఉంటారు.  మీరు సుగ్రీవుని పై దయచూపుడు. నేను ఆయన తరఫున మీనుండి క్షమను కోరుచున్నాను. మీరు ఈ క్రోధమును వదిలివేయుడు.  

రుమాం మాం చాంగదం రాజ్యం ధనధాన్య పశూనిచ

రామప్రియార్థం సుగ్రీవస్త్యజేదితి మతిర్మమ                                            64

సుగ్రీవుడు శ్రీరామునికి ప్రియమొనర్చుటకై రుమను నన్ను, కుమారుడగు అంగదుని, ధనధాన్య పశు మరియు సమస్త రాజ్యమును గూడ తప్పక పరిత్యజించగలడు. ఇది నా దృఢమయిన నమ్మకము.

 మీ సేవ కొరకై పెక్కు వానర వీరులను నలుదిక్కుల సుగ్రీవుడు పంపియుండెను.  అటుపిమ్మట లక్ష్మణుని ముదితపరచుచు సుగ్రీవుడు ఇట్లు పలికెను.

యది కించిదతి క్రాంతం విశ్వసాత్ ప్రణయేనవా

ప్రేష్యస్య క్షమితవ్యం మేన కశ్చిన్నాపరాధ్యతి                               65

విశ్వాసము వలన, ప్రేమవలన, నాచే ఏదైనా అపరాథము సంభావించినచో అద్దానిని క్షమించుడు.  ఎందుకంటె అపరాథము చెయ్యని సేవకుడు యెవ్వడు ఉండడు.  

సుగ్రీవుడుఇట్లు పలుకగా శాంతించిన లక్ష్మణుడు ప్రేమతో ఇట్లు చెప్పెను.  తదుపరి సుగ్రీవుడు నూరుమంది వానరులను తీసుకొని శ్రీరాముడు ఉన్న చోటికి వెళ్ళెను.  శ్రీరాముడు సాదరపూర్వకముగా సుగ్రీవునితో ఇట్లనెను.   

ధర్మమర్థం చ కామం చ కాలే యస్తు నిషేవతే

విభజ్య సతతం వీర స రాజా సరాజా హరిసత్తమ                  66

హిత్వా ధర్మం తథార్థం చ కామం యస్తు నిషేవతే

స వృక్షాగ్రే యథా సుప్తః పతితః ప్రతిబుధ్యతే                           67

వానర శిరోమణి, ధర్మ అర్థ కామములకొరకై సమయమును విభజించి సరిఅయిన సమయమునందు న్యాయయుక్తముగ సేవించువాడే శ్రేష్ఠుడగు రాజగును.  కాని ధర్మార్థములను త్యజించి కేవలము కామమును సేవించువాడు కాలుచున్న కొమ్మపై నిద్రించువాడిమాదిరిగా ఉండును. క్రిందపడిన తరువాతనే అతడు కండ్లు తెరచుకొనును.

ఇప్పుడు మనము ప్రయత్నముచేయుటకై సమయము ఆసన్నమైనది. నీవు ఈ విషయమై ఈ వానరులతోను నీ మంత్రులతోను చర్చించుము.  మహాబలశాలివైన నీ మూలకముగానే నాకు రాజ్యము సంప్రాప్తించినది.

తవదేవా ప్రసాదాచ్చ భ్రాతుశ్చ జయతాం వర

కృతం న ప్రతికుర్యాద్ యః పురుషాణాం హి దూషకః            68

ఓ వీరశ్రేష్టుడా, మీరు మీ అగ్రజుడు శ్రీరామచంద్రుని కృపా కటాక్షములతో  నేను వానర రాజ్యమును పునః ప్రతిష్ఠించితిని.  ఎవడు ఉపకారమునకు ప్రత్యుపకారముచేయడో, అట్టివాడు పరమ నీచ పురుషుడు.    

దేవా రామా, త్వరలో నేను పంపిన వేగులు ఇచ్చటికి వచ్చెదరు.  వానరులు దుష్టుడగు రావణునితో మీ ప్రక్కన ఉండి యుద్ధము చేసెదరు.  అప్పుడు స్నేహపూర్వకముగా శ్రీరామచంద్రుడు సుగ్రీవుని ఆలింగనము చేసికొని ఇట్లనెను.  నీవు నా ఆతృతను అర్థముచేసికొంటివి. అప్పుడు సుగ్రీవుడు వినతుడు అను తన సేనాపతితో ఇట్లనెను. మీరు వానర శ్రేష్ఠులను తీసికొని దుర్గమమగు పర్వతములయందు విదేహరాకుమారి సీతమ్మను వెదకుడు.  మీరు ఉదయాచలము వరకు వెళ్లి సీతమ్మజాడ కనిపెట్టవలయును.  ఒక నెలరోజులలోపు తిరిగి రావలెను.  అప్పుడు శతబలి అను వానరవీరునితో సుగ్రీవుడు ఇట్లనెను. మీరు లక్షమంది వానరవీరులను తోడ్కొని ఉత్తరదిక్కునకు హిమాలయములవైపు పొండు.  అక్కడ క్రౌంచ పర్వతమును గాలింపుడు.  అక్కడ గుఱ్ఱపు మూతిగల కిన్నరీలు నివాసముందురు. అ ప్రదేశమును దాటినచో సిద్దాశ్రమము కనిపించును.  అక్కడ సిద్ధులు, వైఖానస, వాలఖిల్యులు  తపస్వులు౮ నివాసముందురు. 

వందితవ్యాస్తతః సిద్దాస్తపసా వీతకల్మషాః

ప్రష్టవ్యాచాపి సీతాయాః ప్రవృత్తిర్ వినయాన్వితైః                          69

తపస్సుచే వారి పాపములు కదిగివేయబడినవి.  అట్టి సిద్ధులకు మీరు నమస్కరింపుడు.  మరియు సీతమ్మనుగూర్చిన సమాచారమును అడుగురు.

విశేషేణ తు సుగ్రీవో హనూమత్యర్థ ముక్తవాన్

సహి తస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితారోర్థ సాధనే                                70

సుగ్రీవుడు హనుమంతునికి సీతాన్వేషణ భాద్యతను ఎక్కువగా మోపెను.  ఎందుకంటె వానరశ్రేష్ఠులలో ఎక్కవ బాధ్యతాయుతంగా ఒనరించగలడని హనుమంతుని మీద గట్టి నమ్మకము.

సుగ్రీవుడు దృఢనమ్మకముతో హనుమంతునితో ఇట్లనెను.  

తేజసావాపి తే భూతం న సమం భువి విద్యతే 

తద్ యథా లభ్యతే సీతా తత్వమేవానుచింతయ                              71

హి హనుమన్, ఈ భూ ప్తపంచమున నీకు సమానుడెవ్వడును లేడు.  కనుక సీతమ్మను పొందే ఉపాయమును నీవే బాగా ఆలోచించుము. 

త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధిః పరాక్రమః

దేశాకాలాను వృత్తిశ్చ నయశ్చ నయప త                                      72

ఆంజనేయా, నీవు నీతిశాస్త్ర కోవిదుడవు.  బలము, బుద్ధి, పరాక్రమము, దేశకాల అను సరణ, నీతిపూర్ణ ప్రవర్తన వీటియందు నీకంటె పరిపూర్ణుడు వేరొకడు కానరాడు.

సుగ్రీవుని మాటలువినినంతనే, శ్రీరామునికి హనుమంతుని బాధ్యతా పటిమ అవగాహన అయ్యినది. హనుమంతుడు ఈ కార్యమును నేరవేర్చగలడని గట్టి నమ్మకము కలిగెను.  వానరరాజగు సుగ్రీవుని నమ్మకము అట్టిది. స్వయముగా హనుమంతునికి ఇట్టి దృఢనమ్మకము కలిగియుండెను. శ్రీరాముడు తనపేరు చెక్కిన అంగుళీకమును స్వయముగా హనుమంతునికి తనగుర్తుగా సీతమ్మకు అందజేయమని ఇచ్చెను.

శ్రీరాముడు లక్ష్మణునితో కూడి ఆ ప్రస్రవణ పర్వతముమీదనె నివసించదొడంగెను.  ఒక మాసము గడువు కొరకు ప్రతీక్షించుచుండెను. వానరవీరుడగు శతబలి హిమాలయముచే చుట్టబడిన ఉత్తరదిక్కునకు జనేను.  వానర యూథపతియగు వినతుడు తూర్పు దిక్కునకు పోయెను.  అంగదుడు, తారుడు, మొదలగు వానర యోధులతో కూడి ఆంజనేయుడు అగస్త్యముని సేవితమగు దక్షిణదిక్కునకు వెళ్ళెను. వానరయోధుడయిన సుషేణుడు వరుణుని ద్వారా సురక్షితమగు భయంకరమైన పడమటి దిక్కునకు వెళ్ళెను. ఈ ప్రకారము అన్నిదిక్కులకు వానర శ్రేష్టులను పంపి సుగ్రీవుడు స్థిమితముగ ఉండెను. ఒక్క దక్షిణదిక్కునుండి తప్ప మిగిలిన మూడు దిక్కులనుండి వానరులందరు నిరాశతో తిరిగి వచ్చిరి.

విహాయ తంద్రీం శోకం చ నిద్రాం చైవ సముత్థితాం

విచినుధ్వం  తథా సీతాం పశ్యామో జనకాత్మజాం                  73

సోమరితనము, దుఃఖము, నిద్ర – ఈ మూడింటినీ వదిలేద్దాము. మనము జనకపుత్రి  సీతమ్మను వెదుకుటకై సర్వ శక్తులు క్రోడీకరించెదము.  

అనిర్వేదం చ దాక్ష్యం చ మనసశ్చాపరాజయం

కార్యసిద్ధికరాణ్యా హుస్తస్మాదేతద్ బ్రవీమ్యహం                              74

ఉత్సాహము, సామర్థము, మానసిక ధైర్యము – ఈ మూడును అన్నిపరిస్థితులలోను వదిలిపెట్టకూడదు. అవి కార్యసిద్ధికి మూలకారణములు.  అందువలననే ఈ విషయము మీకు చెప్పుచుంటిని.

అవశ్యం కుర్వతాం తస్య దృశ్యతే కర్మణః ఫలం

పరం నిర్వేదమాగమ్య న హి నో న్మీలనం క్షమం                       75

కర్మయండు లగ్నమైఉండు వానికి ఆ కర్మ యొక్క ఫలము తప్పక లభించును.  కావున అత్యంత ఖిన్నులై ప్రయత్నమును విడనాడుట ఏ మాత్రము సమర్థనీయము కానేరదు.

అనంతరము దక్షిణదిక్కువారు  వరుణుని నివాసమగు మహాసముద్రమును చూచిరి. ఇప్పుడు వసంతకాలము రానున్నది.  రాజగు సుగ్రీవుడు నెలరోజులు గడువునిచ్చెను.  వారికి దిక్కుతోచలేదు. అట్టి సమయములో అంగదుడు ఇట్లనెను.  మను కార్యము పూర్తిచేయకుండా తిరిగి వెళ్ళుట ఏమాత్రము యోగ్యము కాదు.  వారందరూ తదుపరి సముద్రము ఉత్తర దిక్కునండు దక్షిణాగ్రముగా దర్భలను పరచిరి.  వారందరూ తూర్పు వైపు కూర్చిండిరి.  వారందరూ ఆమరణనిరాహారదీక్షకు పూనుకొనిరి.    

అప్పుడు వాలికుమారుడు అంగదుడు వాళ్లకి ధైర్యవచనములను ఇట్లు చెప్పెను. 

న విషాదే మనః కార్యం విషాదో దోషవత్తరః

విషాదో హన్తి పురుషం  బాలం క్రుద్ధ ఇవోరగః                             76

వీరులారా, మీరు మీ మానసిక విషాదమును వదిలిపెట్టుడు. ఎందుకంటె విషాదము దోషపూరితమైనది.  క్రోధపూరితమైన సర్పము తనవద్దకు వచ్చిన బాలుని కాటువేసినట్లు విషాదము మనుషులను కాటువేయును.

యో విషాదం ప్రసహతే విక్రమే సముపస్థితే

తేజసా తస్య హీనస్య పురుషార్థో న సిద్ధ్యతి                            77

ఎవడికి ధీరత్వముయొక్క అవసరమొచ్చినప్పుడు విషాదగ్రస్తుడగునో అట్టివాడి తేజస్సు వ్యర్థము. అట్టి తెజోహీనునకు పురుషార్థము సిద్ధింపదు.

వానరవీరులారా, మీయందు ఎవరికిని ఏనాడు గమనము అడ్డుపడదు.  కావున సముద్రమును దాటుటకు మీలో ఎవరికి యెంత శక్తి ఉన్నదో తెలపండి.  అప్పుడు వారు వారివారి ఉత్సాహము శక్తినిగూర్చి చెప్పనారంభించిరి.  అప్పుడు వానర వీరుడు, యూథపతియును అగు జాంబవంతుడు హనుమంతిని ప్రేరేపించెను.  అతడు అందరికంటే ఎగురుటలోమిన్న. హనుమంతుడు ఒంటరిగా కూర్చొనియుండెను. ఆంజనేయా, నీవు శాస్త్రవేత్తలందరిలోను శ్రేష్ఠుడవు. నీవు మిన్నకున్నావేమి ? ఏకాంతముగా కూర్చొనియున్నావేమి? అని అడిగెను.

హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి

రామలక్ష్మణయోశ్చాపి తెజసాచ బలేన చ                              78

హనుమంతా, నీవు వానరరాజగు సుగ్రీవునితో సమానబలవంతుడవు.  మరియు బలమందు శ్రీరామ లక్ష్మణులకు సమానుడవు.

బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వం చ హరిపుఙ్గవ

విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం న సజ్జసే                          79  

ఓ, వానర శ్రేష్టా, నీ యొక్క బలం, బుద్ధి, తేజస్సు, ధైర్యము, అందరికంటే మిన్న.  అంతటా నీ అంతటనీవు సముద్రమునకు దాటుటకు సంసిద్ధుడవు అవ్వమేమి?  

సత్యపరాక్రమమంతుదవాగు ఓ ఆంజనేయ, పూర్వము వాయుదేవుడు నీవు యుద్ధములో ఏ విధమైన అస్త్ర శాస్త్రములచేతను చంపబడజాలవని వరమొసంగెను.  ఇంద్రుడు నీకు ఇచ్ఛా మృత్యువును ప్రసాదించెను.  నీవు కేసరి పుత్రుడవు.  నీ పరాక్రమమునకు శత్రువులు భయపడుడురు.  వానర శేష్ఠా, నీ అపారబలమును విస్తరించుము. నీవు ఎగురుటలో అందరికంటే ఉత్తముడవు.  ఈ వానర సైన్యమంతయు నీ బలపరాక్రమములను చూడగోరుచున్నది.

ఉత్తిష్ఠ హరిశార్దూల లఙ్ఘయస్వ మహార్ణవం

పరాహి సర్వ భూతానాం హనుమన్ యా గతిస్తవ                80   

ఓ ఆజనేయా, లెమ్ము, ఈ మహాసముద్రమును దాటుము.  ఎందుకంటె నీ గమనము అన్నిప్రాణులగమనము కంటే చాలా గొప్పది.

జాంబవంతుడు చెప్పిన ఆ మాటలు ఆంజనేయునిలో నూతన ఉత్సాహమును పొడసూపినది.  అప్పుడు హనుమంతుడు తన విరాట్ రూపమును ప్రదర్శించెను.  నూరు యోజనముల సముద్రమును దాటుటకు తన దేహమును వాయువుతో అనుసంథానము చేసెను.  వానరులందరూ ఆనందముతో హనుమంతుని ఆనందముతో పొగడ సాగిరి.  ఆంజనేయుడు తన బలమును స్మరించేను.  అట్టి స్థితియందు పెద్దలకు నమస్కరించి ఇట్లు చెప్పెను.

బుధ్యాచాహం ప్రవశ్యామి మనశ్చేష్టా చమే తథా

అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం ప్లవఙ్గమాః                             81

వానర మిత్రులారా, నేను బుద్ధితో ఎట్లు ఆలోచనచేయునో, నా మనస్సుయొక్క చేష్టయు దానికి అనుగుణముగానే యుండును. నా మనస్సు బుద్ధికి తేడా లేదు. వైదేహిని చూడగలననే నమ్మకము నాకు దృఢముగా కలుగుతున్నది.  కావున మీరు సంతోషముగా ఉండండి.

వాసవస్య సవజ్రస్య బ్రహ్మణోవా స్వయంభువః

విక్రమ్యసహసా హస్తాదమృతం తదిహాసయే

లఙ్కాం వాపి సముత్క్షిప్య గచ్ఛేయమితి మే మతః                 82

వజ్రదారియగు ఇంద్రుడి చేతినుండిగాని, లేక స్వయంభువగు బ్రహ్మచేతినుండిగాని బలపూర్వకముగా అమృతమును లాగుకొని ఇక్కడికి రాగలను.  లంకను కూకటివ్రేళ్ళతో పెకిలించి తీసికొని రాగలను. అట్టి విశ్వాసము నాకు కలిగినది.   

ఇది విన్న జాంబవంతునికి, వానర మిత్రులకు పరమానందము కలిగినది.

ఋషీనాంచ ప్రసాదేన కపివృద్ధమ తేనచ

గురూణాంచ ప్రసాదేన సంప్లవత్వం మహార్ణవం                           83

ఋషులయొక్క అనుగ్రహముచేతను, వానరపెద్దల అనుమతిచేతను, గురుజనుల ఆశీర్వచములచేతను, నీవు ఈ మహా సముద్రమును దాటివేయువు.

అప్పుడు పవన పుత్ర హనుమాన్ మహేంద్రపర్వతమును అధిరోహించెను.

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana